సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ జరిగే దళితబంధు పథకం అమలు సమావేశానికి తాను వెళ్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలోనూ పథకం అమలు చేస్తున్నారని.. స్థానిక ఎమ్మెల్యేనైన తనను ఈ సభకు ఆహ్వానించారని చెప్పారు. కాంగ్రెస్ తరఫున డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతామన్న భట్టి.. ఏయే అంశాలను ప్రస్తావించాలన్న దానిపై తమ పార్టీ నాయకుల నుంచి సలహాలు స్వీకరించామన్నారు.