Homeఎడ్యుకేషన్తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..?

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..?

TS Education Board

కరోనా మహమ్మారి విజృంభణ విద్యార్థుల కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పది, ఇంటర్ చదువుతున్న విద్యార్థులపై కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా పడింది. వైరస్ వ్యాప్తి వల్ల పది, ఇంటర్ సిలబస్ లలో మార్పులు చేయడంతో పాటు పరీక్షలలో ఛాయిస్ పెంచే దిశగా విద్యాశాఖ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ విద్యార్థులకు మరో శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది.

Also Read: నిరుద్యోగులకు యూపీఎస్సీ శుభవార్త.. భారీ వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..?

ప్రస్తుతం 70 శాతం సిలబస్ తో ఇంటర్ పరీక్షలు జరగనుండగా 30 శాతం సిలబస్ ను ప్రాజెక్టులు, అసైన్ మెంట్ల రూపంలో బోధించారు. ఇంటర్ సిలబస్ ఏకంగా 30 శాతం తగ్గడంతో ఎంసెట్ పరీక్షలు కూడా ఈ సిలబస్ తోనే జరగనున్నాయని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లికి చెందిన ఒక అధికారి ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నట్టు వెల్లడించారు. విద్యార్థులపై భారంపడకుండా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

Also Read: ఐఎండీలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు.. వేతనం ఎంతంటే..?

రాష్ర్ట ఉన్న‌త విద్యామండ‌లి అధికారులు ఇంటర్ సిలబస్ కాపీ చేరిన తరువాత ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ తరువాత ఎంసెట్ సిలబస్ ను ప్రకటించనున్నారు. జూన్ నెల రెండవ వారంలో ఎంసెట్ పరీక్ష నిర్వహణ జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైన తరువాత ఎంసెట్ సిలబస్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

తెలుస్తున్న సమాచారంప్రకారం మే నెల తొలి వారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని సమాచారం. పదో తరగతి పరీక్షలో మొత్తం ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. తెలంగాణలో ఈ ఏడాది 5.50 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper