Uttar Pradesh: ప్రస్తుత సమాజం ఎటువైపు పోతోందో అర్థం కావడం లేదు. తరచూ భార్యలపై బర్తలు దారుణాలకు ఒడిగట్టిన సంఘటనలు వింటూ ఉంటాం. కానీ, ఓ భర్తను నానా రకాలుగా చిత్రహింసలు పెట్టిన భార్య ఉందంత తాజాగా వెలుగుచూసింది. ఈ విషయం తెలిసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆమె బండారం బయట పెట్టేందుకు కుటుంబ సభ్యులే ఇంట్లో సీసీ కెమెరాలు బిగించారు.
ఏం జరిగిందంటే..
ఓ భర్త బట్టలు లేకుండా బెడ్రూంలో మంచంపై పడుకున్నాడు. అతని చేతులు, కాళ్లు కట్టేసి ఉన్నాయి. అతను సాయం కోసం అరుస్తున్నాడు. ఆ సమయంలో అతడి భార్య మంచం మీద విశ్రాంతి తీసుకుంటుంది. సిగరెట్ తాగుతోంది. మధ్య మధ్యలో భర్తను హింసిస్తోంది. ఆ సమయంలో అరుపుల శబ్దం నుంచి అతను ఓదార్పు పొందుతున్నట్లు అనిపించింది. ఆమె అతడిని తిట్టిన ప్రతీసారి అతను భార్య ముందు కనికరం కోసం వేడుకుంటున్నాడు. దయ కోసం అర్జిస్తున్నాడు. కానీ ఆమె కనికరించడంలేదు. చివరకు ఆమె తృప్తి చెందకపోగా చివరకు అతని ప్రైవేటు పార్టుపై కత్తి పెట్టింది.
ఎక్కడ జరిగిందంటే..
విచిత్రమైన భార్య పశుత్వానికి సంబంధించిన ఈ కథ ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్కు చెందినది. తన భార్య దారుణానికి ఒడిగట్టిన విషయాన్ని భర్త పోలీసులకు చెప్పడంతో అధికారులు షాక్ అయ్యారు. అందుకు సాక్షంగా సీసీ టీవీ ఫుటేజీని కూడా పోలీసులకు అందించగా అందులో తన భార్య చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భర్త ఫిర్యాదు, సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేశారు.
ప్రేమించి పెళ్లి చేసుకుని శాడిస్టులా..
ఇదిలా ఉంటే.. ఆ యువతి, యువకులది ప్రేమ వివాహం. ఇద్దరూ మాట్లాడుకుని తర్వాత ప్రేమలో పడ్డారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో 2023, నవంబర్ 17న ముస్లిం సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈ కేసులో కోడలు, తన కొండుకును రోజూ కొట్టేదని యువకుడి తండ్రి చెబుతున్నాడు. పడక గదిలో అతనితో అసహ్యకరమైన పనులు చేసేదని పేర్కొన్నాడు. దీంతో విసిగిపోయిన భర్త బెడ్ రూంలో సీసీ కెమెరాలు పెట్టాడు.
మత్తు మాత్రలు కలిపిన పాలు ఇచ్చి..
ఈ ఏడాది ఏప్రిల్ 29న భార్య అతనికి తాగడానికి పాలు ఇచ్చింది. అందులో మత్తు మాత్రలు కలిపింది. పాలు తాగిన వెంటనే భర్త స్పృహ తప్పాడు. అప్పుడు భార్య తన భర్త బట్టలు విప్పేసింది. ఎండు చేతులు కట్టేసింది. అనంతరం అతని ప్రైవేటు పార్లును సిగరెట్తో కాల్చింది. అంతేకాదు కత్తితో శరీరంపై గాయాలు చేసింది. ఈ సమయంలో సిగరెట్ తాగుతూ కనిపించింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.