maheshbabu new look
ఇప్పటికే ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న ప్రిన్స్ మహేశ్బాబు తాజాగా కొత్త రికార్డును సృష్టించారు. ఆయన నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రూ.130 కోట్లు వసూలు చేసింది. ఇది ఆయన కెరీర్లోనే రికార్డు కలెక్షన్స్, ఇప్పటి వరకు ఆయన నటించిన ‘మహర్షి’ రూ. 100 కోట్లు వసూలు చేసింది. భరత్ అనే నేను సినిమా నుంచి వరుసగా మూడు సినిమాలు విజయం కావడంతో మహేశ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. కాగా మహేశ్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చిత్రీకరణలో ఉన్నారు. పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రెడీ అవుతోంది. ఆర్థిక నేరాల చుట్టూ ఈ కథ ఉంటోందని ఇప్పటికే టాక్ వినిపిస్తోంది.