Homeబిజినెస్Stock Market : 700 పాయింట్లకు పైగా పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్, 24,800 దగ్గర...

Stock Market : 700 పాయింట్లకు పైగా పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్, 24,800 దగ్గర నిఫ్టీ-50

Stock Market : అంతర్జాతీయ సంకేతాలను అనుసరించి భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ-50 శుక్రవారం ట్రేడింగ్ లో పడిపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 81,200 స్థాయికి చేరువలో ఉండగా, నిఫ్టీ-50 24,800 స్థాయికి సమీపంలో ఉంది. ఉదయం 9.16 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 697 పాయింట్లు (0.85 శాతం) నష్టపోయి 81,170.86 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ-50 205 పాయింట్లు (0.82%) క్షీణించి 24,805.70 వద్ద ముగిసింది. నిఫ్టీ ప్రస్తుతం 25,100ని సమీపిస్తోంది. ‘ఈ స్థాయిని అధిగమించేందుకు కొత్త ట్రిగ్గర్లు అవసరం. ప్రపంచ మార్కెట్లలో ముఖ్యంగా అమెరికాలో జోరు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ, బ్యాంకింగ్ సంస్థల పనితీరు మందగమనంగా కొనసాగుతోంది. జాగ్రత్తగా స్టాక్ ఎంపికకు ప్రాధాన్యమిస్తూ డిప్స్ వ్యూహాన్ని మేము సమర్థిస్తూనే ఉన్నాం’ అని అజిత్ మిశ్రా – ఎస్‌వీపీ, రీసెర్చ్, రెలిగేర్ బ్రోకింగ్ అధినేత తలెపారు. ‘కీలకమైన నిరోధ స్థాయి 25,000-25,100 చెక్కు చెదరకుండా ఉంది. ఇండెక్స్ ఈ ప్రాంతంపై నిర్ణయాత్మకంగా అధిగమించడంలో విఫలమైంది. 24,750 స్థాయిల వద్ద తక్షణ మద్దతుతో స్వల్పకాలిక కన్సాలిడేషన్ లేదా స్వల్ప తగ్గుదల సాధ్యం’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కు చెందిన నాగరాజ్ శెట్టి తెలిపారు. ఎస్ అండ్ పీ 500 ఫ్యూచర్స్, హాంగ్ సెంగ్ ఫ్యూచర్స్, నిక్కీ 225 ఫ్యూచర్స్, జపాన్ టోపిక్స్, ఆస్ట్రేలియాకు చెందిన ఎస్ అండ్ పీ/ఏఎస్ఎక్స్ 200, యూరో స్టోక్స్ 50 ఫ్యూచర్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యూరో, జపనీస్ యెన్, ఆఫ్షోర్ యువాన్, ఆస్ట్రేలియన్ కరెన్సీలు యూఎస్ డాలర్ తో పోలిస్తే స్వల్ప మార్పును చూపడంతో ఫారెక్స్ మార్కెట్ సాపేక్షంగా స్థిరంగా ఉంది.

చమురు ధరలు శుక్రవారం పెరిగాయి. కానీ మధ్యప్రాచ్యంలో సరఫరా అంతరాయాల భయాలను అధిగమించి నిరాశాజనక ప్రపంచ ఇంధన డిమాండ్ వృద్ధి సంకేతాల కారణంగా నాలుగో వారపు క్షీణతకు సిద్ధంగా ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 0.4 శాతం పెరుగుదలతో 79.85 డాలర్లకు చేరుకోగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర 0.5 శాతం పెరుగుదలతో 76.69 డాలర్లకు ఎగసింది.

ఇండియా సిమెంట్స్, గ్రాన్యూల్స్, బిర్లాసాఫ్ట్, ఇండియామార్ట్, ఆర్బీఎల్ బ్యాంక్, జీఎన్ఎఫ్సీ సహా పలు స్టాక్స్ నేడు ఎఫ్ అండ్ ఓ బ్యాన్ పీరియడ్లో ఉన్నాయి. విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు గురువారం రూ.2,089 కోట్ల నికర కొనుగోలుదారులుగా మారగా, డీఐఐలు రూ.337 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. టైటాన్, హిందుస్థాన్ జింక్, ఢిల్లీవేరీతో పాటు మరో 98 కంపెనీలు తమ తొలి త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించనున్నాయి.

నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ రోజు, నిఫ్టీ మొదటిసారి 25 వేలకు మించి ముగియగా, సెన్సెక్స్ కూడా రికార్డు స్థాయిలో ముగిసింది. ఈ రోజు గురించి మాట్లాడితే ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో తీవ్ర క్షీణత ఉంది. దేశీయ మార్కెట్ కూడా దాని నుంచి తప్పించుకోలేకపోయింది. ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా దాడి కారణంగా, సెన్సెక్స్, నిఫ్టీ రెండూ పడిపోయాయి. నిఫ్టీలోని అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ఉన్నాయి. మెటల్, ఆటో, రియాల్టీ సూచీలు ఒక్కొక్కటి ఒక శాతానికి పైగా క్షీణించాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఓవరాల్ గా బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.4.26 లక్షల కోట్లు తగ్గింది.అంటే మార్కెట్ ప్రారంభమైన వెంటనే ఇన్వెస్టర్ల సంపద రూ.4.26 లక్షల కోట్లు తగ్గింది.

ఒక ట్రేడింగ్ రోజు ముందు అంటే ఆగస్ట్ 1, 2024న, బీఎస్ఈ జాబితా చేయబడిన అన్ని షేర్ల మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 4,61,62,949.83 కోట్లు. ఈ రోజు అంటే ఆగస్ట్ 2, 2024న మార్కెట్ ప్రారంభమైన వెంటనే రూ. 4,57,36,628.09 కోట్లకు చేరుకుంది. అంటే ఇన్వెస్టర్ల మూలధనం రూ.4,26,321.74 కోట్లు తగ్గింది.

85 షేర్లు ఏడాది గరిష్టానికి చేరాయి
ఈ రోజు బీఎస్‌ఈలో 2649 షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. ఇందులో 651 షేర్లు స్ట్రాంగ్ గా, 1849 క్షీణతతో, 149 షేర్లు ఎలాంటి మార్పును కనబరుస్తున్నాయి. ఇది కాకుండా 85 షేర్లు ఏడాది గరిష్టానికి, 14 షేర్లు ఏడాది కనిష్టానికి పడిపోయాయి. 75 షేర్లు అప్పర్ సర్క్యూట్‌కు చేరుకోగా, 60 షేర్లు లోయర్ సర్క్యూట్‌కు చేరుకున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Oktelugu Epaper