Homeబిజినెస్కంపెనీ సూపర్ ఆఫర్.. ఐడియా చెబితే రూ.5 లక్షలు..?

కంపెనీ సూపర్ ఆఫర్.. ఐడియా చెబితే రూ.5 లక్షలు..?

ప్రముఖ సంస్థలలో ఒకటైన ఎన్‌టీపీసీ కంపెనీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఒక్క ఐడియాతో ఏకంగా 5 లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే వేస్టేజ్‌ ను నూటికి నూరు శాతం ఉపయోగించుకునే ఐడియా ఇవ్వడం ద్వారా ఈ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. పర్యావరణం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం మరియు వారి సలహాలు తీసుకోవడం ఈ కాంపిటీషన్ యొక్క ముఖ్య ఉద్దేశం.

2021 సంవత్సరం మే నెల 19వ తేదీ వరకు ఈ పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఎవరైతే మంచి ఐడియా ఇస్తారో వారికి మొదటి బహుమతి కింద 5 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తి సమయంలో వెలువడే వ్యర్థాలకు సొల్యూషన్ చెప్పడం ద్వారా ఈ డబ్బును పొందే అవకాశం ఉంటుంది. ఎన్‌టీపీసీ సంస్థకు మొత్తం 70 పవర్ స్టేషన్లు ఉండగా ఈ పవర్ స్టేషన్లలో 26 రెన్యూవబుల్ ప్రాజెక్టులు, 18 జీడబ్ల్యూ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి.

ఈ పవర్ స్టేషన్ల ద్వారా 65825 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుంది. ఆలస్యం చేయకుండా మంచి ఐడియా చెప్పడం ద్వారా ఈ డబ్బును గెలుచుకోవచ్చు. ఆసక్తి ఉన్నవాళ్లు ఈ పోటీలో పాల్గొని సులభంగా డబ్బును గెలుచుకోవచ్చు. దాదాపు నెల రోజులు గడువు ఉండగా ఆసక్తి ఉన్నవాళ్లు ఐడియా చెప్పి డబ్బును గెలుచుకోవచ్చు. మరోవైపు ఎన్టీపీసీ వరుస నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది.

ఈ జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది. ఎన్టీపీసీ ఈ మధ్య కాలంలో వరుస నోటిఫికేషన్లను విడుదల చేస్తుండటం గమనార్హం.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular