Homeటాప్ స్టోరీస్Ramagundam Kidney Diseases : వందలో 8 మందికి కిడ్నీ సమస్యలు.. ఆ సింగరేణి ప్రాంతానికి...

Ramagundam Kidney Diseases : వందలో 8 మందికి కిడ్నీ సమస్యలు.. ఆ సింగరేణి ప్రాంతానికి ఏమైంది?

Ramagundam Kidney Diseases : రామగుండం.. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న పారిశ్రామిక ప్రాంతం. సింగరేణి బొగ్గు గనులతోపాటు నేషనల్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ఇక్కడే ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తుంటారు. అందుకే రామగుండం మినీ ఇండియాగా కూడా గుర్తింపు పొందింది. లక్షలాది మంది ఉంటున్న రామగుండంలో వాతావరణం కూడా ఇతర ప్రాంతాల కాన్న వ్యత్యాసం ఉంటుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. పరిశ్రమలు, బొగ్గు గనుల కారణంగా ఇక్కడ కాలుష్యం కూడా ఎక్కువే. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులతో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కేంద్రంగా విరాజిల్లుతున్న ఈ నగరం, ఇప్పుడు కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. ఈ కాలుష్యం స్థానిక ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

పరిశ్రమల కేంద్రం..
రామగుండం దశాబ్దాలుగా పరిశ్రమలకు కేంద్రంగా ఉంది. థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు, రసాయన ఎరువుల పరిశ్రమలు, బొగ్గు గనులతోపాటు ఇతర భారీ యూనిట్లు ఈ ప్రాంతాన్ని ఆర్థిక హబ్‌గా మార్చాయి. వేలాది మంది కార్మికులు ఇక్కడ ఉపాధి కోసం వలస వస్తున్నారు. అయితే, ఈ పారిశ్రామిక వృద్ధి కాలుష్యాన్ని తెచ్చిపెట్టింది. ఇది ఇప్పుడు స్థానికుల ఆరోగ్యానికి ముప్పుగా మారింది.

పెరుగుతున్న కిడ్నీ వ్యాధి బాధితులు..
పరిశ్రమల నుంచి వెలువడే విషపూరిత వ్యర్థాలు, వాయు కాలుష్యం, నీటి కలుషితం రామగుండంలో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. నీటిలో భారీ లోహాలు, రసాయనాల కలగలుపు కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. స్థానికంగా నిర్వహించిన అధ్యయనాలు, 100 మందిలో 8 మంది కిడ్నీ సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్నట్లు సూచిస్తున్నాయి. ఈ సమస్యలు ముఖ్యంగా దీర్ఘకాల కిడ్నీ వ్యాధుల రూపంలో కనిపిస్తున్నాయి.

ఆందోళనలో స్థానిక ప్రజలు..
కిడ్నీ సమస్యలు రామగుండంలోని ప్రజల జీవన గమనాన్ని మార్చేస్తున్నాయి. చాలా మంది కార్మిక కుటుంబాలు, ఆర్థిక స్థోమత లేక డయాలసిస్‌ వంటి ఖరీదైన చికిత్సలను భరించలేకపోతున్నారు. స్థానిక ఆసుపత్రులు రోగుల సంఖ్యను తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. అదనంగా, కాలుష్యం గురించి అవగాహన లేకపోవడం, సరైన ఆరోగ్య సౌకర్యాల కొరత కూడా సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. దీంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కానరాని కాలుష్య నియంత్రణ చర్యలు..
రామగుండంలో కాలుష్య సమస్యను పరిష్కరించడానికి, పరిశ్రమలపై కఠినమైన నియంత్రణలు, వ్యర్థ నిర్వహణ వ్యవస్థలను మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. కానీ సంస్థలు వీటిని నిర్లక్ష్యం చేస్తున్నాయి. పొల్యూషన్‌ కాంట్రోల్‌ బోర్డు అధికారులు కూడా కాలుష్య స్థాయిని తగ్గించి చూపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, పరిశ్రమలు సమన్వయంతో పనిచేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అదే సమయంలో, స్థానికులకు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, సరసమైన చికిత్స సౌకర్యాలు అందించాల్సిన అవసరం ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular