Homeబిజినెస్Norton: రాయల్ ఎన్ ఫీల్డ్ చెక్ పెట్టేలా టీవీఎస్ ప్లాన్.. రంగంలోకి నార్టన్ బైక్

Norton: రాయల్ ఎన్ ఫీల్డ్ చెక్ పెట్టేలా టీవీఎస్ ప్లాన్.. రంగంలోకి నార్టన్ బైక్

Norton: టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి బ్రిటీష్ బ్రాండ్ నార్టన్ మోటార్‌సైకిల్‌ను భారతదేశానికి తీసుకురానున్నట్లు ప్రకటించింది. మే 6న భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (FTA) ఆమోదం లభించిన వెంటనే టీవీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు ఈ ప్రకటన చేశారు. ఈ చర్యతో యూకేలో తయారైన కార్లు, బైకులపై దిగుమతి సుంకం 100 శాతం నుంచి కేవలం 10 శాతానికి తగ్గుతుంది. దీనివల్ల నార్టన్ బైక్‌లు గతంలో కంటే చౌకగా మారతాయి.

Also Read: దాయాది క్షిపణులు ఔట్.. S-400 సిస్టమ్ ప్రత్యేకతలేంటి?

సుదర్శన్ వేణు ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. “మా బ్రిటీష్ బ్రాండ్ నార్టన్ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం అవుతుంది. ఈ ఒప్పందం మాకు వేగంగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. అభివృద్ధి చెందిన భారతదేశం వైపు అడుగులు వేయడానికి మేము సంతోషిస్తున్నాము.” ఆర్థిక సంక్షోభంలో ఉన్న నార్టన్ మోటార్‌సైకిల్స్‌ను టీవీఎస్ 2020లో రూ.153 కోట్లకు కొనుగోలు చేసింది. టీవీఎస్ ఈ ప్రక్రియలో రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టి నార్టన్‌తో కలిసి పనిచేస్తోంది. కంపెనీ గత కొన్నేళ్లుగా బైక్‌ల ప్రస్తుత శ్రేణిని మెరుగుపరచడంతో పాటు సరికొత్త మోడళ్లను కూడా విడుదల చేసింది.

ప్రీమియం బైక్‌లను తీసుకురానున్న కంపెనీ
టీవీఎస్ మొదట నార్టన్ మోటార్‌సైకిల్ ప్రీమియం బైక్ సిరిస్ తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఇందులో కమాండో 961, V4SV, V4CR ఉన్నాయి. ఈ బైక్‌లు పూర్తిగా నిర్మించిన యూనిట్లు (CBU)గా వచ్చే అవకాశం ఉంది. వీటిని యూకేలోని సోలిహుల్ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. కంపెనీ “మేడ్ ఇన్ ఇండియా” ఉత్పత్తులను ప్రారంభించే ముందు ఈ బైక్‌లను బ్రాండ్ బిల్డర్‌లుగా ఉపయోగించుకుంటుంది. 2027 నాటికి 6 కొత్త బైక్‌లను విడుదల చేయాలని కంపెనీ ఇప్పటికే కన్ఫాం చేసింది. వాటిలో కొన్ని భారతదేశంలో తయారు అవుతాయి.

నార్టన్ 300-400 సిసి బైక్‌పై పనిచేస్తోంది, ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్, ట్రయంఫ్, హార్లే-డేవిడ్‌సన్, హోండా వంటి కంపెనీలకు పోటీనిస్తుంది. ఈ బ్రాండ్ అధికారికంగా సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో బైక్‌లను విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఇది పండుగ సీజన్ సమయం అవుతుంది. భారత్-యూకే ఒప్పందం నార్టన్ బైక్‌లకు భారతీయ మార్కెట్‌లో తమ స్థానాన్ని బలపరుచుకునేందుకు ఉపయోగపడనుంది. ట్రయంఫ్, రోల్స్-రాయిస్, బెంట్లీ, మెక్లారెన్, లోటస్, ఆస్టన్ మార్టిన్, జెఎల్‌ఆర్ వంటి ఇతర బ్రాండ్‌లకు కూడా వారి పూర్తి దిగుమతులను భారతదేశానికి తీసుకురావడానికి ఈ ఒప్పందం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular