Homeబిజినెస్Gold Prices: పసిడి కొనాలనుకునే వారికి అలర్ట్.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Prices: పసిడి కొనాలనుకునే వారికి అలర్ట్.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Prices: గ్లోబల్ మార్కెట్ లో కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్ రేట్ 2048 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. సిల్వర్ రేట్ మాత్రం ఔన్స్ కు 25.12 డాలర్లు కొనసాగుతోంది.అయితే దేశీయంగా మాత్రం బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. వెండి ధరలు కూడా అదే బాటలో కొనసాగతున్నాయి. దీంతో పసిడి కొనాలనుకునేవారికి ఊరట లభించినట్లయింది.

బులియన్ మార్కెట్ ప్రకారం.. నవంబర్ 29న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,350గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,560 గా ఉంది. నవంబర్ 28న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,100తో విక్రయించారు. మంగళవారం కంటే బుధవారం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,710గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,350 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,560 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,800 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,050తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,350 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,560తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,350తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,560తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగానే కొనసాగాయి. బుధవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.78,500గా నమోదైంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం వెండి ధరల్లో మార్పు లేదు. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.78,500గా ఉంది. ముంబైలో రూ.78,500, చెన్నైలో రూ.81,500, బెంగుళూరులో 76,250, హైదరాబాద్ లో రూ.81,500తో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular