కడప జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు తీవ్రమయ్యాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గండికోట ముంపు పరిహారం జాబితాలో అనర్హలు ఉన్నారంటూ కొండూపురం మండలం పి. అనంతపురం గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన ఓ వర్గానికి చెందిన గురునాథ్ రెడ్డి అనే వ్యక్తి గతంలో అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టేందుకు మండలస్థాయి గ్రామసభను నిర్వహించారు. దీంతో వైసీపీకి చెందిన మరో వర్గం గురునాథ్ రెడ్డితో గొడవ పడ్డారు. గొడవ పెద్దది కావడంతో రాళ్లు, కట్టెలతో పరస్పరం దాడి చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన గురునాథ్ రెడ్డిని తాడిపత్రి ఆసుప్రతికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురునాథ్ రెడ్డి మరణించారు. దీంతో గ్రామంలో పోలీసులు పికెట్ ఏర్పాుట చేశారు.