spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Varudu Kalyani: వైసీపీ శాసనమండలి పక్ష నేతగా ఆమె?!

Varudu Kalyani: వైసీపీ శాసనమండలి పక్ష నేతగా ఆమె?!

Varudu Kalyani: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన అనారోగ్యానికి గురికావడం ఇటీవల రెండోసారి. గతంలో ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళన చేస్తున్న క్రమంలో సొంత నియోజకవర్గంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. సభలో మాట్లాడుతుండగానే ఆయన స్పృహ తప్పి పడిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందించారు. అప్పట్లోనే ఆయన రాజకీయాలనుంచి దూరమవుతారని ప్రచారం నడిచింది. కానీ మళ్ళీ యాక్టివ్ అయ్యారు. అయితే ఇటీవల మళ్ళీ ఆయన అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్ తరలించారు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయనపై విపరీతమైన స్ట్రెస్ పడడంతోనే అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. అందుకే వీలైనంతవరకు రాజకీయాలకు క్రమేపి దూరం కావాలని బొత్స భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఖమేనీ ఖతం.. ఇజ్రాయెల్, అమెరికా ఇకనైనా యుద్ధం ముగిస్తాయా?

* భారం తగ్గించేందుకు..
ప్రస్తుతం బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో నేతగా వ్యవహరిస్తున్నారు. శాసనసభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకున్న స్థాయిలో సంఖ్యాబలం లేదు. శాసనమండలిలో బలం ఉండడంతో వైసిపి పక్ష నేతగా బొత్స సత్యనారాయణ కు అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. సీనియర్ నేత కావడంతో పాటు ఆజాతశత్రువుగా ఆయనకు పేరు ఉంది. ఆయన శాసనమండలిలో ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపించవచ్చు అని భావించారు జగన్మోహన్ రెడ్డి. అయితే పూర్తి అనారోగ్యానికి గురికావడంతో ఆయనపై భారం తప్పించాలని కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డిని కోరినట్లు తెలుస్తోంది.

* కళ్యాణి వైపు మొగ్గు…
శాసనమండలిలో వైసిపి పక్ష నేత పదవి కోసం చాలామంది పోటీపడుతున్నారు. ప్రముఖంగా వైసీపీ ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, పివిపి సూర్యనారాయణ రాజు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఉత్తరాంధ్రాకు చెందిన వరుదు కళ్యాణి శాసనమండలిలో బలమైన వాయిస్ వినిపించ గలుగుతున్నారు. ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. విధానపరమైన అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరికించగలుగుతున్నారు. పైగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో ఆమెకు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. అదే జరిగితే ఉత్తరాంధ్రకు గొప్ప గౌరవం దక్కినట్టే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Shreyas Iyer Captaincy

Shreyas Iyer Captaincy: మొదటి పరీక్షలోనే ఫెయిల్.. అయ్యర్ కు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా దండగే

Shreyas Iyer Captaincy: కాపురం చేసే కళ నిశ్చయ తాంబూలాల సమయంలోనే తెలుస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ సామెతను ఒకవేళ క్రికెట్ క్రీడకు అన్వయిస్తే ఒక కెప్టెన్ సామర్థ్యం తన తొలి...
Diamond Rain

Diamond Rain: వజ్రాల వాన కురుస్తోంది.. ఏరుకోవడానికి మీరు సిద్ధమా

Diamond Rain: ఈ భూమి మీద అత్యంత ఖరీదైన లోహాలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి. అవి కూడా పరిమితంగా ఉన్నాయి. కాకపోతే మనుషులకు అరుదైన లోహాల మీద విపరీతమైన ఆసక్తి....
Today 23 July 2026 Horoscope

Today 23 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. జీవితంలో ఊహించని మార్పులు..

Today 23 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్ల యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండా...
INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Oktelugu Epaper