spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Tirumala Laddu: తిరుమల లడ్డూలో కలిపింది అదేనట.. ఎట్టకేలకు తేల్చిన సీబీఐ

Tirumala Laddu: తిరుమల లడ్డూలో కలిపింది అదేనట.. ఎట్టకేలకు తేల్చిన సీబీఐ

Tirumala Laddu: టీటీడీ( Tirumala Tirupati Devasthanam ) లడ్డూ వివాదం ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఇది పెను వివాదానికి దారి తీసింది. దీంతో సుప్రీంకోర్టు స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంయుక్తంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. గత కొద్ది నెలలుగా ఈ బృందం తిరుమల కేంద్రంగా విచారణ చేపట్టింది. లడ్డు వివాదానికి సంబంధించి విచారణ ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం జరిగింది. అయితే శ్రీవారి లడ్డు తయారీకే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్లో సైతం ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టుకు నివేదించడం విశేషం.

Also Read: జగన్ ఐదు వారాల వ్రతాలు చేస్తున్నాడా? ఏబీఎన్ వెంకటకృష్ణ సూపర్ సిక్స్ అమలు పై ఇలానే మాట్లాడగలడా?

* కొనసాగుతున్న విచారణ
గత కొద్ది రోజులుగా సిబిఐ( Central Bureau of Investigation ) అధికారి నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది. అయితే ఇటీవల విచారణ నివేదికను హైకోర్టుకు అందించింది ఈ బృందం. తిరుమల తో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ, కనకదుర్గ, ద్వారకాతిరుమల, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయాల్లో ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని తమ దర్యాప్తులో తేలినట్లు సిబిఐ అడ్వకేట్ హైకోర్టుకు నివేదించారు. అయితే ఇది కల్తీ నెయ్యి అనడం కంటే ఆవు నెయ్యి పేరుతో పామాయిల్ లో కెమికల్స్ కలిపి ఆవు నెయ్యిల కనబడేలా, సువాసన వచ్చేలా చేసి ప్రసాదాలకు సరఫరా చేశారని కోర్టుకు నివేదించారు. దీంతో జంతువు అనే పదం రాకుండా.. పామాయిల్ అని నివేదించడం ఈ కేసులో కీలక పరిణామంగా భావిస్తున్నారు.

* భక్తుల ఆందోళన తిరుమలలో( Tirumala) తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువు కలిసిందనే వార్త యావత్ ప్రపంచంలో ఉన్న శ్రీవారి భక్తులను కలచివేసింది. అయితే దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. రాజకీయ దురుద్దేశంతోనే కూటమి ప్రభుత్వం తిరుమలలో జంతువు కలిపారని ఆరోపిస్తున్నారని.. నిష్పక్షపాత విచారణ జరగాలని టీటీడీ పూర్వపు అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం దర్యాప్తు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ప్రత్యేక బృందాన్ని నియమించింది. దీనికి సిబిఐ అధికారి నేతృత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి చాలా మంది అరెస్టులు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు కేసు తుది దశకు చేరుకుంటోంది. నెయ్యిలో కల్తీ అయితే జరిగిందని.. అది పామాయిల్ తో కూడిన కెమికల్ అని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. కానీ అసలు విషయం పై క్లారిటీ రానుంది కొద్దిరోజుల్లో.. అంతవరకు వెయిట్ చేయక తప్పదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper