AP Liquor Scam Case: ఏపీలో కీలక పరిణామం ఒకటి చోటుచేసుకుంది. లిక్కర్ స్కామ్ లో అధికార టిడిపి ఎంపీ భార్యకు ఈడి నోటీసులు జారీ చేసింది. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని భార్య జానకి లక్ష్మి కి ఈడీ సమన్లు జారీ అయ్యాయి. ఈనెల 27న విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఫ్రైడ్ ఇన్ఫ్రా కాన్ LLP కంపెనీతో మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డికి ఉన్న లింకులపై ఈడి ఆర్ఆర్బీస్తోంది. ఈ కంపెనీకి మద్యం కుంభకోణంలో లాభాల్లో షేర్ ఉన్నట్లు ఈడి అనుమానిస్తోంది. గతంలో కూడా జానకి లక్ష్మి కి ఈడి సమన్లు జారీ అయ్యాయి. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది ఈడీ. ఓ అధికార పార్టీ ఎంపీకి ఈ తరహా నోటీసులు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది.
మాజీ ఎంపీ సంచలన ఆరోపణలు..
తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరారు కేసినేని నాని. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తమ్ముడు కేసినేని చిన్ని పై ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. అయితే కేశినేని చిన్ని పై మాత్రం నిత్యం సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు నాని. ఈ క్రమంలోనే మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి తో.. ఎంపీ కేసినేని చిన్నికి సంబంధాలు ఉన్నాయి అంటూ ఆయన సోదరుడు నాని సంచలన ఆరోపణలు చేశారు. చిన్ని దంపతులు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కసిరెడ్డి వ్యాపార సంస్థలు భాగస్వామ్యులని ఆరోపించారు. సీఎం చంద్రబాబుకు సైతం ఫిర్యాదు చేశారు. చిన్ని దంపతులు రాజ్ కసిరెడ్డి కి చెందిన ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ LLP లో భాగస్తులు అని అప్పట్లో ఆరోపించారు. కేశినేని చిన్ని తన కంపెనీల ద్వారా భారీగా నిధులను అక్రమంగా విదేశాలకు తరలించి మనీ లాండరింగ్ కు పాల్పడ్డారంటూ ఆరోపణలు గుర్తించారు.
ఇదివరకే ఒకసారి నోటీసులు..
అయితే తనపై వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవచ్చు అంటూ కేశినేని చిన్ని సవాల్ చేశారు. తన వల్ల పార్టీకి ఎటువంటి చెడ్డ పేరు రాకూడదని.. కేసినేని నాని ఆరోపిస్తున్నట్టు తాను రాజ్ కసిరెడ్డి సంస్థలు వ్యాపార భాగస్వామి కాదని తేల్చి చెప్పారు. ఈడి దర్యాప్తుతో పాటు కేసు విచారణకు సహకరిస్తానని కూడా చెప్పారు. అయితే గతంలోనే కేసినేని చిన్ని భార్య జానకి లక్ష్మి కి నోటీసులు అందాయి. ఇప్పుడు మరోసారి విచారణకు పిలవడంతో సంచలనంగా మారింది. ఇప్పుడు అందరి దృష్టి మద్యం కుంభకోణం కేసు పై పడింది. ఈనెల 27న జానకి లక్ష్మి ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.
