Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Godavari Pushkaralu Visit: ఉదయం లేవగానే... ఇంత ఫాస్ట్ ఏంటి పవన్..

Pawan Kalyan Godavari Pushkaralu Visit: ఉదయం లేవగానే… ఇంత ఫాస్ట్ ఏంటి పవన్..

Pawan Kalyan Godavari Pushkaralu Visit: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా కమిట్మెంట్ తో చేస్తారు. మనసుకు నచ్చిన పని అయితే ఇట్టే పూర్తి చేస్తారు. ఆయన గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పర్యవేక్షించాలని నిర్ణయించారు. అలా అనుకున్నదే తడువు రంగంలోకి దిగిపోయారు. సోమవారం తన పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రికి రాజమండ్రి చేరుకున్నారు. సోమవారం ఉదయం 7:00 దాటకముందే రంగంలోకి దిగారు. రాజమండ్రిలోని గోదావరి పుష్కర ఘాట్ల పరిశీలన కోసం ఆయన సోమవారం నగరంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం సాయంత్రానికి ఆయన రాజమండ్రి నగరానికి చేరుకోవడం విశేషం.

ఉదయం 7 గంటలకే..
సాధారణంగా మంత్రుల పర్యటనలు ఉదయం తొమ్మిది గంటల తరువాత ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఉదయం ఏడు గంటలకు ముందే రంగంలోకి దిగిపోయారు. రాజమండ్రిలో రాత్రి బస చేసిన ఆయన.. ఉదయం నుంచి పర్యటనలను ప్రారంభించారు. రాజమండ్రి పరిధిలోని గోదావరి పుష్కర ఘాట్ల పనుల పరిశీలన మొదలుపెట్టారు. ఈ పనుల కారణంగా గోదావరి జలాలు కాలుష్యం బారిన పడకుండా తీసుకుంటున్న జాగ్రత్తగా కూడా పవన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. నదిలో పేరుకుపోతున్న కాలుష్య కారకాలను పరిశీలించారు. వాటిని తొలగించే చర్యలపై అధికారులతో చర్చించారు. గోదావరి తీరాన్ని కాలుష్య రహితంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు, వాటి అమలు తీరుపై నా పవన్ దృష్టిపెట్టారు. పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో కాలుష్యరహితంగా ఆయా ప్రాంతాలను తీర్చిదిద్దాలన్న దిశగా పవన్ సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు మమేకమై పనిచేస్తున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో రాజమండ్రిలో ప్రస్తుతం కోలాహలం నెలకొంది.

ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు..
అయితే పవన్ కళ్యాణ్ కు ఒక అరుదైన అవకాశం దక్కింది గోదావరి పుష్కరాల రూపంలో. ప్రస్తుతం ఆయన కాకినాడ జిల్లాకు మంత్రిగా ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం కూడా కాకినాడ జిల్లాలోనే ఉంది. సహజంగానే గోదావరి జిల్లాలు అంటే పవన్ కళ్యాణ్ మానియా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పర్యవేక్షణకు గాను పవన్ కళ్యాణ్ రావడంతో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. పెద్ద ఎత్తున యువత గోదావరి నది పరివాహక ప్రాంతాలను చుట్టుముట్టేశారు. తమ అభిమాన నేతను సెల్ఫోన్లతో వీడియోలు, ఫోటోలు గా తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజమండ్రిలో పవన్ పర్యటన అనేది వైరల్ గా మారుతుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Oktelugu Epaper