Sai Krishna Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగర పరిధిలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చోటు చేసుకున్న సాయి కృష్ణ కేసులో కీలక విషయాలు తెలుస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం వేగంగా విచారణ కొనసాగిస్తోంది. అంతేకాదు కృష్ణలంక సీఐ నాగరాజును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విచారిస్తున్నారు.
నాగరాజును విచారిస్తున్న క్రమంలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ పోలీసులు నాగరాజు స్నేహితుడు సురేష్ ను అరెస్ట్ చేశారు. నాగరాజు స్నేహితుడు సురేష్ కు ఈ కేసుతో ఏం సంబంధం.. సాయి కృష్ణ వ్యవహారంలో అతడికి ఏమైనా పాత్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..
ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సిఐ నాగరాజు స్నేహితుడు సురేష్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ కేసు మరింత జటిలంగా మారింది. కీలకమైన పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో.. సాయి కృష్ణ వ్యవహారంలో ఏం జరిగింది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సాయి కృష్ణ మరణించిన తర్వాత అతడి మృతదేహాన్ని మాయం చేయడానికి సురేష్ సహాయం చేశాడని.. సాయి కృష్ణ మృతదేహాన్ని సురేష్ వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు తమ విచారణలో గుర్తించారు.. శ్రీ నాగరాజు సురేష్ అన్ని విధాలుగా సహాయం చేసినట్టు ఆధారాలు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులకు లభ్యమయ్యాయి.. సిఐ నాగరాజుకు సురేష్ తో ఆర్థికపరమైన సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది.
సాయి కృష్ణ మరణ వార్తను బయటికి రాకుండా ఉండడానికి సురేష్ వారి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిగినట్టు తెలుస్తోంది.. కుటుంబ సభ్యులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి సురేష్ రకరకాల ప్రయత్నాలు చేసినట్టు కూడా సమాచారం.. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో వివరాలు సురేష్ ద్వారా తెలిసే అవకాశం ఉంది. అతడు చెప్పే వివరాల ఆధారంగా ఈ కేసు కు సంబంధించిన మరిన్ని విషయాలు బయటపడతాయని సమాచారం.
