Homeఆంధ్రప్రదేశ్‌Sai Krishna Case: సాయి కృష్ణ కేసు.. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దొరికిన ఫోన్.. అందు...

Sai Krishna Case: సాయి కృష్ణ కేసు.. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దొరికిన ఫోన్.. అందు లోనే అంతా ఉంది..

Sai Krishna Case: రౌడీ షీటర్ సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.. ఇప్పటిదాకా ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు.. కీలక విషయాలు తెలిసినప్పటికీ.. కేసును మలుపు తిప్పే అసలు సంగతి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కేసులో మరిన్ని పెద్ద తలకాయలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సాయి కృష్ణ కనిపించకుండా పోయిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ కూడా ఇన్స్పెక్టర్ నాగరాజు.. హెడ్ కానిస్టేబుళ్ళు […]

Sai Krishna Case: రౌడీ షీటర్ సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.. ఇప్పటిదాకా ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు.. కీలక విషయాలు తెలిసినప్పటికీ.. కేసును మలుపు తిప్పే అసలు సంగతి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కేసులో మరిన్ని పెద్ద తలకాయలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

సాయి కృష్ణ కనిపించకుండా పోయిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ కూడా ఇన్స్పెక్టర్ నాగరాజు.. హెడ్ కానిస్టేబుళ్ళు అశోక్ కుమార్, నాని మధ్య చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒక మొబైల్ షాప్ నుంచి వీరంతా కూడా లాభ కంపెనీకి సంబంధించిన కీప్యాడ్ ఫోన్ కొనుగోలు చేశారు. అందులో ఏమాత్రం పని చేయని జియో సిమ్ కార్డ్ ఏర్పాటు చేశారు. వీటిని విజయవాడ నగరంలోని గవర్నర్పేట ప్రాంతంలో ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో కొనుగోలు చేసినట్టు సమాచారం. వాస్తవానికి జియో సిమ్ లు అన్ని స్మార్ట్ ఫోన్లలో పనిచేస్తుంటాయి. కీప్యాడ్ ఫోన్లలో సిమ్ వేసినప్పుడు.. ఆ కంపెనీకి సంబంధించిన డివైస్ లో అమర్చినప్పుడు మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. అయితే సాయి కృష్ణ వ్యవహారంలో పోలీసులు ఇలా ఎందుకు చేశారు అనే దానిమీద ఇంతవరకు క్లారిటీ లేదు. లావా ఫోన్లో జియో సిమ్ వేసి.. కావాలని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ వి ఆర్ దగ్గర వదిలేసారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు పక్కదారి పడుతుందని.. దానిని అలా చేయడానికి ఇలా చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సాంకేతికంగా దర్యాప్తు గంగా చేస్తే అసలు విషయం బయట పడుతుందని తెలుస్తోంది.

ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలకు అనుసంధానించిన ఎన్విఆర్.. హార్డ్ డిస్క్. నిర్వహణ మొత్తం ఇన్స్పెక్టర్ ఛాంబర్ లోనే ఉంటుంది. వాటిని పరిశీలించాలంటే కచ్చితంగా ఇన్స్పెక్టర్ అనుమతి ఉండాలి. ఆయన ఆదేశాలు ఇవ్వడంతోనే హార్డ్ డిస్క్ లు మార్చినట్టు తెలుస్తోంది.. వీటిని సౌత్రిక టెక్నాలజీస్ అనే కంపెనీ వీటిని ఏర్పాటు చేసింది. కానిస్టేబుళ్లు అశోక్, నాని వీటిని అత్యంత తెలివిగా తొలగించి.. అదే సంవత్సర సంబంధించిన హార్డ్ డిస్క్ లు కొత్త వాటిని ఏర్పాటు చేశారు. వాటిపై సీరియల్ నెంబర్లు పరిశీలించినప్పుడు ఈ మార్చిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.. సౌత్రిక కంపెనీ ఏర్పాటుచేసిన సీరియల్ నెంబర్లు.. అశోక్ , నాని ఏర్పాటుచేసిన హార్డ్ డిస్క్ సీరియల్ నెంబర్లు సరి పోలడం లేదు. ఫుటేజీని మాయం చేయడానికి ఇలా చేశారని తెలుస్తోంది.

మార్కాపురం నుంచి మే 6న సాయి కృష్ణను కృష్ణలంక తీసుకొచ్చారు. అప్పటినుంచి మే 8 వరకు అనేక దృశ్యాలు సీసీ కెమెరాలు నిక్షిప్తమయ్యాయి. ఆ తర్వాత ఆ ఫుటేజీ మొత్తం తొలగించాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. వాటిని తొలగించాలంటే కచ్చితంగా యూజర్ ఐడి.. పాస్వర్డ్ తెలిసి ఉండాలి.. సురక్ష ప్రాజెక్టులో భాగంగా కమిషనరేట్ లో వీటిని ఏర్పాటు చేశారు. అంతేకాదు ఐ టి వి భాగంలో సీసీ కెమెరాల యూజర్ ఐడి, పాస్వర్డ్లు స్టోర్ చేశారు. స్టేషన్లో ఈ వివరాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకవేళ హార్డ్ డిస్క్ అలానే ఉంటే డాటా మొత్తం రిట్రైవ్ చేసే అవకాశం ఉంటుంది. ఇదంతా ఎందుకని ఒక సాంకేతిక నిపుణుడిని తీసుకొచ్చి హార్డ్ డిస్క్ లు తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేశారు.. పాత హార్డ్ డిస్క్ లను తగలబెట్టారని సమాచారం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper