Homeఆంధ్రప్రదేశ్‌New IT Company In Andhra Pradesh: ఏపీకి మరో దిగ్గజ ఐటీ కంపెనీ?

New IT Company In Andhra Pradesh: ఏపీకి మరో దిగ్గజ ఐటీ కంపెనీ?

New IT Company In Andhra Pradesh: ఏపీకి ( Andhra Pradesh)మరో ఐటి దిగ్గజ సంస్థ రానుంది. త్వరలో కార్యకలాపాలను ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నామమాత్రపు ధరకు భూమి కేటాయించేందుకు సిద్ధపడింది. చాలా రోజుల కిందట సంబంధిత సంస్థ ప్రతినిధులతో నారా లోకేష్ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. దావోస్ పర్యటన సమయంలోనే ఈ ఒప్పందం జరిగినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఆ దిగ్గజ సంస్థ రాకతో భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంతవరకు ఏపీ ప్రభుత్వం దీనిని ధ్రువీకరించలేదు. తెర వెనుక మాత్రం అంతా పూర్తయినట్లు సమాచారం. ఏపీకి ప్రముఖ ఐటీ కంపెనీగా గుర్తింపు పొందిన కాగ్నిజెంట్ వస్తున్నట్లు సమాచారం. విశాఖలో 1500 కోట్ల రూపాయలతో క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ యాజమాన్యం ముందుకొచ్చింది. రూపాయి కంటే తక్కువ వరకు ఆ కంపెనీకి ఏపీ ప్రభుత్వం భూమి కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఎనిమిది వేల ఉద్యోగాల కల్పన కాగ్నిజెంట్( Cognizant ) క్యాంపస్ ఏర్పాటుతో వచ్చే ఎనిమిదేళ్లలో ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఈ కంపెనీ 2029 మార్చినాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖను ఐటి హబ్ గా మార్చుతామని కూటమి ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే కాగ్నిజెంట్ ఏర్పాటుకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐటీ కంపెనీలకు విశాఖలో భూములు కేటాయించారు. ఇప్పుడు కాగ్నిజెంట్ సైతం విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో కాపులుప్పాడలో 21.31 ఎకరాల భూమిని కాగ్నిజెంట్ కోరినట్లు సమాచారం. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రపు ధరకే కేటాయించినట్లు తెలుస్తోంది.

Also Read:  Who brought IT to Hyderabad : ఏంటీ..హైదరాబాద్ కి మొట్టమొదటి ఐటీ కంపెనీ తెచ్చింది ఇతనా..? చంద్రబాబు కాదా?

దావోస్ లోనే ఒప్పందం?
ఆ మధ్యన దావోస్( davos ) పెట్టుబడుల సదస్సుకు సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్ వెళ్లారు. ఆ సమయంలోనే మంత్రి నారా లోకేష్ కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవికుమార్ ను కలిశారు. విశాఖ వంటి అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని కోరారు. అయితే అప్పట్లోనే సానుకూలత వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాగ్నిజెంట్ ప్రతినిధులు విశాఖ వచ్చి పరిస్థితులను అధ్యయనం చేశారు. ఇక్కడ క్యాంపస్ ఏర్పాటుకు అనువుగా ఉందని గుర్తించినట్లు సమాచారం. దీంతోనే కాగ్నిజెంట్ కంపెనీ ఏర్పాటుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే టి సి ఎస్ కంపెనీకి
విశాఖ నగరం ( Vishakha City )ఐటి హబ్ గా మారుతుంది. ఎప్పటికే టీసీఎస్ కంపెనీకి భూముల కేటాయింపు విషయంలో ఏపీ క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. విశాఖలో టిసిఎస్ ఏర్పాటు కోసం ఏకంగా 21.16 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే కేటాయించినట్లు నిర్ణయించింది. ఏడాదికి కేవలం 99 పైసల లీజు మాత్రమే ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీలో దీనిపైనే ఆమోదం తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలకు సంబంధించి అనుసరిస్తున్న ఫార్ములాను ఏపీలో కొనసాగించేందుకు నిర్ణయించారు. ఇప్పుడు కాగ్నిజెంట్ కంపెనీ ఏర్పాట్లు సైతం ప్రభుత్వం అదే తరహా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular