Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Andhra Pradesh » Nara lokesh tirumala goshala incident

Nara Lokesh: తిరుమల గోశాలలో ఘోరం.. ఖండించిన నారా లోకేష్.. నిజానిజాలివీ

Nara Lokesh గత కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) నిర్వహణ విషయంలో అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లడ్డు కల్తీ కి గురైందని వచ్చిన ఆరోపణలు భక్తుల మనోభావాలను దెబ్బతీసాయి.

Written By:Dharma Raj, Updated On : April 12, 2025 / 01:41 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Nara Lokesh Tirumala Goshala Incident

Nara Lokesh

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Nara Lokesh: నిజం నిలకడగా తెలుస్తుంది అంటారు. నిజం ఇంటి నుంచి చెప్పులేసుకుని బయలుదేరే ముందు అబద్ధం ఊరంతా ప్రచారం చేస్తుందంటారు. ఇప్పుడు టీటీడీ( Tirumala Tirupati Devasthanam) విషయంలో జరుగుతోంది అదే. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పింక్ డైమండ్ పోయిందని రాజకీయ ప్రత్యర్థులు ప్రచారం చేశారు. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. తరువాత ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చిన దానిపై విచారణ లేకుండా పోయింది. కనీసం దాని ఊసు లేదు. దీంతో అది ఫేక్ అని నిర్ధారణ అయిపోయింది. అయితే తాజాగా టీటీడీ నిర్వహిస్తున్న గోశాలలో 100కు పైగా ఆవులు చనిపోయాయని వార్త హల్చల్ చేస్తోంది. దీనిపై రకరకాల ప్రచారం జరుగుతోంది. టిటిడితో పాటు ప్రభుత్వం స్పందించింది.

Also Read: పొన్నవోలు ఔట్.. తెరపైకి అంబటి!

గత కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) నిర్వహణ విషయంలో అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లడ్డు కల్తీ కి గురైందని వచ్చిన ఆరోపణలు భక్తుల మనోభావాలను దెబ్బతీసాయి. దీనిపై ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతోంది. అదే సమయంలో స్వామివారి ఉత్తర ద్వారా దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీలో అపశృతి జరిగింది. ఓ ఆరుగురు వరకు భక్తులు చనిపోయారు. తిరుమల చరిత్రలోనే అత్యంత విషాద ఘటనగా ఇది మిగిలింది. అయితే టీటీడీ వైఫల్యం పై అప్పట్లో వైసీపీ ఆరోపణలు చేసింది. అదే సమయంలో టిటిడితో పాటు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాయి.

* వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు..
అయితే తాజాగా టీటీడీ నిర్వహిస్తున్న గోశాలను ( goshala) 100 ఆవులు చనిపోయాయని ప్రచారం జరిగింది దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ నాయకుడు, టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి స్పందించారు. టీటీడీ నిర్లక్ష్యం వల్లనే భూశాలలో పెద్ద సంఖ్యలో ఆవులు చనిపోతున్నాయని ఆరోపించారు. వాస్తవాలను బయటకు తీసుకురావాలని.. తిరుమల పవిత్రతను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. గోశాల సరైన నిర్వహణ లేక గత మూడు నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయాయని చెప్పుకొచ్చారు. తమ హయాంలో గోశాల నిర్వహణ బాగుండేదని.. కూటమి ప్రభుత్వంలోనే అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు కరుణాకర్ రెడ్డి. అప్పటినుంచి దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

* టీటీడీ స్పష్టమైన ప్రకటన..
అయితే దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tirupati Devasthanam) స్పందించింది. ఆవులు చనిపోయాయి అన్న వార్త ఫేక్ అని తేల్చింది. అందులో ఎంత మాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత టిటిడి స్పందించింది. ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న నకిలీ వార్తలను నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. చనిపోయిన ఆవులు తమ గోశాలకు చెందినవి కావు అంటూ కూడా స్పష్టతనిచ్చింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు కొంతమంది ఇలా నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నారని చెప్పుకొచ్చింది. దీంతో తిరుమల గోశాలలో ఆవుల మృత్యువాత పడలేదని స్పష్టమైంది. అదంతా ఉత్త ప్రచారం అని తేలిపోయింది.

* నారా లోకేష్ స్పందన ఇది..
తాజాగా ఈ ఘటనపై స్పందించారు మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh ). సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.’ టీటీడీ గోశాలలో ఆవుల మరణాల గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న నిరాధారమైన, దురుద్దేశ పూరిత ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను. ఈ వాదనలో ఎటువంటి నిజం లేదు. టీటీడీ వాస్తవాలను స్పష్టం చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుదారి పట్టించడానికి, రెచ్చగొట్టడానికి ముందుకు తెచ్చిన ఈ తప్పుడు కథనాన్ని నమ్మవద్దని భక్తులను కోరుతున్నాం. రాజకీయ లాభం కోసం పవిత్ర సంస్థల గురించి అబద్ధాలు వ్యాప్తి చేయడం సిగ్గుచేటు, ఆమోదయోగ్యం కాదు’ అని నారా లోకేష్ స్పష్టం చేశారు.

Dharma Raj

Dharma Raj Author - OkTelugu

Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Read More

Web Title: Nara lokesh tirumala goshala incident

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • ap politics
  • chandrababu
  • CM Chandrababu
  • Nara Lokesh
  • Tirumala Tirupati Devasthanam
Follow OkTelugu on WhatsApp

Related News

Rajnath Singh Chandrababu: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో చంద్రబాబు భేటీ

Rajnath Singh Chandrababu: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో చంద్రబాబు భేటీ

Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్ ఇస్తున్నారా?

Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్ ఇస్తున్నారా?

Y S Jagan Mohan Reddy: కూటమి’పై జగన్ ప్రతీకారం తప్పదా?

Y S Jagan Mohan Reddy: కూటమి’పై జగన్ ప్రతీకారం తప్పదా?

YSR Congress : వైసీపీలో లోపిస్తున్న ‘కమ్మ’దనం.. ఆ వర్గం నేతలంతా సైలెంట్!

YSR Congress : వైసీపీలో లోపిస్తున్న ‘కమ్మ’దనం.. ఆ వర్గం నేతలంతా సైలెంట్!

CM Chandrababu: చంద్రబాబుకు బిల్ గేట్స్ లేఖ

CM Chandrababu: చంద్రబాబుకు బిల్ గేట్స్ లేఖ

Jagan : అది జగన్ ట్రాప్.. గుణపాఠాలు నేర్వని కూటమి!

Jagan : అది జగన్ ట్రాప్.. గుణపాఠాలు నేర్వని కూటమి!

Nara Lokesh : నారా లోకేష్ కు లైన్ క్లియర్!

Nara Lokesh : నారా లోకేష్ కు లైన్ క్లియర్!

Vallabhaneni Vamsi:  తీవ్ర నిర్ణయం దిశగా వల్లభనేని వంశీ మోహన్.. బెయిల్ పై వచ్చిన వెంటనే!

Vallabhaneni Vamsi:  తీవ్ర నిర్ణయం దిశగా వల్లభనేని వంశీ మోహన్.. బెయిల్ పై వచ్చిన వెంటనే!

AP Government : ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. త్వరలో అమలు..

AP Government : ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. త్వరలో అమలు..

ఫొటో గేలరీ

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.