Homeఆంధ్రప్రదేశ్‌Jogi Ramesh Fake Liquor Case: అప్పుడు నకిలీ వ్యాపారం.. ఇప్పుడు ప్రభుత్వంపై కుట్ర.. జోగి...

Jogi Ramesh Fake Liquor Case: అప్పుడు నకిలీ వ్యాపారం.. ఇప్పుడు ప్రభుత్వంపై కుట్ర.. జోగి రమేష్ ప్లాన్!

Jogi Ramesh Fake Liquor Case: ఏపీలో నకిలీ మద్యం తయారీకి సంబంధించిన ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిఐడి. ఏడాది కిందట చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం లో నకిలీ మద్యం డంపు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీని మూలాలు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఉన్నాయని.. అప్పట్లో నకిలీ మద్యంతో కోట్లాది రూపాయలు సంపాదించిన విషయం బయటపడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నకిలీ మద్యం తయారీ జరిపి.. కూటమి ప్రభుత్వం పై రాజకీయ విమర్శలు వచ్చేలా ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నకిలీ మద్యంతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. కూటమి వచ్చిన తర్వాత రాజకీయ కుట్రకు తెర లేపారు. అసలు ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరు? ఎప్పటి నుంచి ఈ తతంగం ప్రారంభం అయింది? మొత్తం అంశాలను చార్జ్ షీట్ లో పొందుపరిచింది సిఐడి.

* ఈ కేసులో ప్రధాన నిందితులు అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రెడ్డి సోదరులు. వీరికి జోగి రమేష్ సోదరులతో మంచి సంబంధాలు ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారుచేసి సరఫరా చేసేవారు అద్దేపల్లి సోదరులు. వారిపై ఎటువంటి కేసులు, అరెస్టులు జరగకుండా జోగి రమేష్ చూసుకునేవారు. వీరికి పరస్పర వ్యాపార ప్రయోజనాలు ఉండేవి. ప్రతి రెండు నెలలకు ఐదు లక్షల రూపాయల చొప్పున జోగి రమేష్ నుంచి వీరికి అందేది. వ్యాపారంలో వచ్చిన కోట్లాది రూపాయల లాభాలు తిరిగి జోగి రమేష్ సోదరులకు వెళ్ళేవి. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో వీరి వ్యాపారం కోట్లలో జరిగింది. అద్దేపల్లి సోదరులతో పాటు జోగి రమేష్ సోదరులు బాగానే లాభపడ్డారు అనేది ఈ చార్జ్ షీట్ సారాంశం.

* కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని అక్రమాల మయంగా చూపించాలన్నది వీరి ప్రణాళిక. ఈ విషయంలో జోగి రమేష్ అద్దేపల్లి సోదరులను ప్రలోభ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే చాలా ప్రాంతాల్లో టెండర్లు దక్కించుకున్న వ్యాపారులకు నష్టాలు తప్పవు అన్న భయం వెంటాడింది ప్రారంభంలో. అలా తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జ్ జయ చంద్రారెడ్డి అనుచరులు కూడా అలానే బాధపడ్డారు. ఈ విషయం మద్యం వ్యాపారంలో ఆరితేరిన అద్దేపల్లి సోదరులకు అర్థం అయింది. అప్పుడే జోగి రమేష్ అద్దేపల్లి సోదరులను పిలిపించి తంబళ్లపల్లె ద్వారా కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రణాళిక రూపొందించారు. అక్కడ నకిలీ మద్యం తయారీని ప్రోత్సహించారు. ఇందుకుగాను కొంత మొత్తాన్ని అందిస్తానని అద్దేపల్లి జనార్దన్ రావుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. నీ చేతికి మట్టి అంటకుండా చూస్తానని చెప్పడంతో.. తంబళ్లపల్లెలో నకిలీ మద్యం తయారు చేయించి జయ చంద్రారెడ్డి అనుచరుల మద్యం దుకాణాలకు అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఇలా నకిలీ మద్యం తయారుచేసిన తరువాత జోగి రమేష్ ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో అద్దేపల్లి జనార్దన్ రావు విదేశాలకు వెళ్లిపోయారు. ఏమీ తెలియనట్టుగా జోగి రమేష్ ఈ నకిలీ మద్యాన్ని పట్టించి.. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆందోళనలు చేయించారు.. అయితే జోగి రమేష్ నుంచి ఆశించిన స్థాయిలో సాయం రాకపోవడంతో అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసులకు చిక్కిపోయారు. జరిగిందంతా చెప్పేసారు పోలీసులకు. ఇప్పుడు చార్జ్ షీట్లో అదే విషయాన్ని చెప్పింది సిఐడి..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper