Homeఆంధ్రప్రదేశ్‌Jagan Mohan Reddy: జగన్ పై వైసీపీ కాపు నేతల ఆగ్రహం!

Jagan Mohan Reddy: జగన్ పై వైసీపీ కాపు నేతల ఆగ్రహం!

Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతలు ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఏపీలో కాపుల చుట్టూ వైసిపి రాజకీయం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సాయి కృష్ణ అదృశ్యం మిస్టరీ తర్వాత కాపుల చుట్టూ మరింత రాజకీయ వేడి పెంచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాపులను కూటమి అన్యాయం చేస్తోంది అని ఆరోపిస్తోంది. అయితే ఇప్పుడు ముద్రగడ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ […]

Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతలు ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఏపీలో కాపుల చుట్టూ వైసిపి రాజకీయం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సాయి కృష్ణ అదృశ్యం మిస్టరీ తర్వాత కాపుల చుట్టూ మరింత రాజకీయ వేడి పెంచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాపులను కూటమి అన్యాయం చేస్తోంది అని ఆరోపిస్తోంది. అయితే ఇప్పుడు ముద్రగడ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరి పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతవరకు ఆయన ముద్రగడను పరామర్శించకపోవడం ఏమిటనేది వైసిపి నేతలు ప్రశ్నిస్తున్న మాట.

Also Read: వాళ్ల వల్లే టీమిండియా చెత్త ప్రదర్శన.. టి20 చరిత్రలో ఇదే ఫస్ట్ టైం..

* జగన్ కోసం తనను తాను తగ్గించుకుని..
కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడిగా ముద్రగడ పద్మనాభం కు పేరు ఉంది. అదే సమయంలో ఆయన చంద్రబాబుకు వ్యతిరేకి. అందుకే కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని చేపట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం కల్పించారు అనేది బహిరంగ రహస్యం. ఆపై మొన్నటి ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని శపధం చేశారు. అలా చేయకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని కూడా సవాల్ చేశారు. అలానే మార్చుకున్నారు. జగన్ కోసం తన పెద్దమనిషి తరహాను కూడా తక్కువ చేసుకున్నారు ముద్రగడ. కానీ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి నుంచి ఎటువంటి ప్రయోజనం పొందలేకపోయారు ముద్రగడ.

* పరామర్శించకపోవడంపై..
మొన్ననే సాయి కృష్ణ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే. కేవలం కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడని భావించి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. కానీ కాపు జాతికే ఒక ఆదర్శంగా ఉన్న ముద్రగడ పద్మనాభం విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి అంత చొరవ చూపలేదు. పైగా ముద్రగడ వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని ప్రచారం సాగింది. ఆయన కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయిస్తే అనుకున్న స్థాయిలో పట్టించుకోలేదని కూడా టాక్ నడిచింది. ఈ పరిణామాలతో వైసిపి కాపు నేతల్లో ఒక రకమైన ఆగ్రహం వ్యక్తం అవుతోంది జగన్మోహన్ రెడ్డి పై. ఒక వైపు తమ ద్వారా కాపు రాజకీయం చేస్తున్నారు. ఇంకోవైపు ముద్రగడ విషయంలో నిర్లక్ష్యం చేయడంపై వారు ఆవేదనతో ఉన్నారట. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper