Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan: జగన్ వేట అట్లుంటది

CM Jagan: జగన్ వేట అట్లుంటది

CM Jagan: రాజకీయంగా జగన్ మొండివాడు. తండ్రి అకాల మరణంతో ఆయన అధికారాన్ని అందుకోవడానికి ప్రయత్నించారు. అందుకు అడ్డగించిన కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారు. అందుకు జైలు జీవితానికి కూడా సిద్ధపడ్డారు. 16 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపారు. అయినా సరే ధైర్యంగా ముందుకు సాగారు. పార్టీని ఏర్పాటు చేసి ప్రతిపక్షంలోకి రాగలిగారు. ప్రతిపక్షాన్ని సమర్థవంతంగా తీసుకెళ్తూ అధికారాన్ని అందుకోగలిగారు. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కంటే చంద్రబాబు పైనే పగ పెంచుకున్నారు. అధికారంలోకి వచ్చాక అదే స్థాయిలో చంద్రబాబుపై రివెంజ్ తీర్చుకున్నారు.

జగన్ ఆర్థిక మూలాలను చంద్రబాబు దెబ్బతీశారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి జగన్ ను కకావికలం చేయాలని చూశారు. ఎలాగోలా బయటపడిన జగన్ రాజకీయంగా నిలదొక్కుకున్నారు. 2014 ఎన్నికల్లో 67 సీట్లతో ప్రతిపక్షంలోకి రాగలిగారు. అయినా సరే చంద్రబాబు వదల్లేదు. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను బలవంతంగా లాక్కున్నారు. అక్కడితో కూడా జగన్ వెనక్కి తగ్గలేదు. ఇంకా రాజకీయంగా బలోపేతం అవుతూ వచ్చారు. రాజకీయంగా చంద్రబాబును ఢీకొట్టారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి రాగలిగారు.

తనను అణచివేయడానికి ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడమే కాకుండా.. కేసులతో ఉక్కిరి బిక్కిరి చేసిన చంద్రబాబుపై జగన్ అదే ఫార్ములాను అనుసరించారు. నేరుగా చంద్రబాబుపై కాకుండా ఆయన చుట్టూ ఉన్న బినామీలపై దృష్టి పెట్టారు. నాటి మంత్రి నారాయణ చుట్టూ ఉచ్చు బిగించారు. తాజాగా ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు పై సైతం కేసు నమోదు అందులో భాగమే. అటు అమరావతి రాజధాని నిర్వీర్యం చేయడం ద్వారా చంద్రబాబు ఆర్థిక మూలాలను బలంగా దెబ్బ తీశారు. మొన్నటి అవినీతి కేసుల్లో సైతం చంద్రబాబును వెంటాడారు. దాదాపు 52 రోజులు పాటు రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు. ఇప్పటికీ నారాయణ ను వెంటాడుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న పన్ను ఎగవేతకు సంబంధించి కేసులను తిరగదోడారు.

చంద్రబాబు అంటే జగన్ కు.. జగన్ అంటే చంద్రబాబుకు ఒక్క రకమైన కసి. ఇద్దరూ ఒకరిపై ఒకరు పగ ప్రతీకారంతో గడుపుతున్నారు. కేసులతో ఉక్కు పాదం మోపాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే బిజెపితో పొత్తుల నుంచి.. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తల వరకు తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. తద్వారా ఎన్నికల్లో దెబ్బతీయాలని భావిస్తున్నారు. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబుతో పాటు టిడిపి నేతల ఆర్థిక మూలాలను జగన్ దెబ్బతీస్తారు. అదే చంద్రబాబు అధికారంలోకి వస్తే మాత్రం వైసీపీ నేతలకు చుక్కలు చూపించడం ఖాయం. ఇలా ఎలా చూసుకున్నా ఏపీ రాజకీయాలు సిద్ధాంత పరంగా లేవు. కేవలం వ్యక్తిగత అణచివేతకే నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో జగన్ ఆలోచన వేరే విధంగా ఉంటుందనడంలో అతిశయోక్తి కాదు. అందుకే చంద్రబాబు సైతం చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీలో బలమే లేని బిజెపికి పొత్తులో భాగంగా సింహభాగం ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular