Homeఆంధ్రప్రదేశ్‌Jagan Frustration: ప్రెస్ మీట్ పెడితే జగన్ లో ఫ్రస్టేషన్!

Jagan Frustration: ప్రెస్ మీట్ పెడితే జగన్ లో ఫ్రస్టేషన్!

Jagan Frustration: జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వస్తే ఏదో సంచలనం ఉంటుంది అనే రోజులు పోయాయి. ఎందుకంటే ప్రతివారం సంచలనాలు అంటే సాధ్యం కాదు కానీ. ఆయన సోషల్ మీడియాకు కావాల్సిన వార్తలను, ప్రాధాన్యత అంశాలను ఇచ్చి పోతున్నారన్న కామెంట్ ఉంది. ఈరోజు తాజాగా మీడియా ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. మొన్న ఆ మధ్యన విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత తాడేపల్లికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఏదో విశేషం ఉంటుంది అని అంతా ఆశించారు. కానీ ఆయన మాత్రం తనలో ఉన్న ఫ్రస్టేషన్ ను బయట పెట్టుకున్నారు. మరోసారి చంద్రబాబు వయస్సును గుర్తు చేసుకున్నారు. ఎంతోకాలం రాజకీయాలు చేయలేరని తనలో తాను ధైర్యం తెచ్చుకున్నట్టు ఉన్నారు. చంద్రబాబుకు గుండెపోటు వస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో మాటలు చెప్పారు.

మావిగన్ పేరు చెబితే చంద్రబాబుకు గుండెపోటు..
అయితే మరిచిపోయారు అనుకున్న మావిగన్ రాజధాని గురించి మరోసారి గుర్తు చేసుకున్నారు జగన్. ఆ పేరు వింటేనే చంద్రబాబుకు గుండెపోటు వస్తుందని చెప్పారు. అయితే ఒక విషయం జగన్మోహన్ రెడ్డి మరిచారు. ఆయన ఏనాడైతే మావిగన్ అని ప్రతిపాదన చేశారో.. నాటి నుంచే విపరీతమైన ట్రోల్స్ కు గురయ్యారు. సోషల్ మీడియా కోడై కూసింది. వైసీపీ నేతలు సైతం ఆ పేరు పలికేందుకు ఇష్టపడలేదు. ఇప్పుడు అదే మావిగన్ పేరుతో చంద్రబాబు హడలెత్తిపోయారట.. ఆయనకు గుండెపోటు వచ్చినంత పనైందట.. ఇలా జగన్మోహన్ రెడ్డి చెప్పేసరికి అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు సైతం షాక్ కు గురయ్యారు.. మరోవైపు అమరావతిపై మరోసారి విషం చిమ్మె ప్రయత్నం చేశారు. అయితే అందులో ఎవరికి పెద్దగా ఆశ్చర్యం లేదు కూడా. ఎందుకంటే సాక్షిలో వచ్చిన కథనాలనే తర్వాత ప్రెస్ మీట్ లో ప్రస్తావిస్తారు జగన్. అమరావతి విషయంలో జగన్ ఏం కామెంట్స్ చేసిన జనాలు పెద్దగా పట్టించుకోరు.

శాంతి భద్రతల విషయంలో..
మరోవైపు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో రాష్ట్రంలో శాంతిభద్రతల విషయం ప్రస్తావనకు వచ్చింది. కడపలో పెద్ద దస్తగిరి హత్య.. నకిలీ మద్యం దందాలు.. జోగి రమేష్ పై ప్రస్తావన ఇలా అన్నింటిని టిడిపి ఖాతాలో వేసి ప్రయత్నం చేశారు జగన్. జాతరలో జరిగిన గొడవతో పెద్ద దస్తగిరి హత్యకు గురయ్యారని ఆయన భార్య చెప్పిన విషయాన్ని ఇప్పుడు జగన్ మరోసారి గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తీరు చూస్తుంటే వైసీపీ నేతలకు సైతం మింగుడు పడడం లేదు. ప్రారంభంలో ఆహా ఓహో అన్నారు కానీ.. క్రమేపి వైసిపి నేతలు కూడా పెదవి విరుస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థి మరణాన్ని కోరుకోవడం.. ఆయన వయసును ప్రస్తావించడం.. ఇంకా ఎన్నాళ్లు బతుకుతాడు లే అనే మాటలు మాత్రం జగన్మోహన్ రెడ్డి నైజాన్ని బయటపెడుతోంది. ఈ వారాంతపు ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డికి లాభం కంటే నష్టమే ఎక్కువగా చేకూరుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular