Homeఆంధ్రప్రదేశ్‌Margadarshi Case : మార్గదర్శికి నిప్పు.. ఇక రామోజీకే ఎసరు

Margadarshi Case : మార్గదర్శికి నిప్పు.. ఇక రామోజీకే ఎసరు

Margadarshi Case : మార్గదర్శి కేసులతో రాజగురువు రామోజీరావుకు ఏపీ సీఎం జగన్ వెంటాడుతునే ఉన్నారు. ఇప్పటివరకూ ఎవరూ సాహసించని విధంగా సీఐడీ కేసులతో వెంటపడుతున్నారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తూ రామోజీరావు సైతం అదే దూకుడును కనబరుస్తున్నారు. ఇటీవల గుంటూరులోని సీఐడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు సైతం డుమ్మా కొట్టారు. చాలా రోజుల కిందటే సీఐడీ అధికారులు విచారణకు హాజరుకావాలని రామోజీరావుతో పాటు శైలజా కిరణ్ లకు నోటీసులిచ్చారు. కానీ తీరా హాజరుకావాలసిన సమయానికి అనారోగ్యంతో ఉన్నానని రామోజీరావు.. రాలేని స్థితిలో ఉన్నానని శైలజా కిరణ్ లు ఈ మెయిల్ ద్వారా సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఈ కేసు విచారణలో భాగంగా చైర్మన్ గా ఉన్న రామోజీరావు, ఎండీ అయిన శైలజాకిరణ్ లు గైర్హాజరైనా.. ఏపీలో మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లు మాత్రం హాజరయ్యారు. విచారణ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. డిపాజిట్ల నుంచి నిధుల మళ్లింపు వరకూ విచారణ కొనసాగినట్టు తెలుస్తోంది. డిపాజిట్లు ఎలా సేకరించారు. చిట్ పాడిన వారికి ఎన్నిరోజుల్లో నగదు ఇస్తున్నారు? కమీషన్ ఎంత వసూలు చేసేవారు అన్నవాటిపై సీఐడీ అధికారులు క్షుణ్ణంగా ఆరా తీసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై సీఐడీ వర్గాలు స్పందించలేదు.

అయితే ఈ విషయంలో నీలి మీడియా చేస్తున్న అతి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సాక్షి మీడియాలో బ్రాంచ్ మేనేజర్లు సీఐడీ అధికారులకు సరెండర్ అయిపోయినట్టు కథనం వచ్చింది. గతం నుంచి డిపాజిట్లు ఇదే విధంగా పక్కదారి పట్టించేవారమని.. తాము నిమిత్తమాత్రులమని.. యాజమాన్యం చెప్పిన విధంగా నడుచుకున్నట్టు వారు స్టేట్ మెంట్ ఇచ్చినట్టు సాక్షి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. రాజగురువు అడ్డంగా దొరికిపోయారని.. ఆయన వందీమాగధులు పూర్తి సమాచారమిచ్చారని.. రామోజీ పని అయిపోయిందన్న రేంజ్ లో సాక్షి కథనం వడ్డించింది.

దీనిపై తెలుగులోని అత్యంత సర్క్యూలేషన్ ఉన్న పత్రిక అయిన ఈనాడులో మాత్రం ఎటువంటి కథనం రాలేదు. ఇప్పటివరకూ రాజకీయ ప్రముఖుల అభిప్రాయాలతో రామోజీరావు మంచి వాడని, రాజకీయ దురుద్దేశ్యంతో వైసీపీ సర్కారు కక్ష సాధింపు చర్యలకు దిగుతోందంటూ పతాక శీర్షికన కథనాలు వెలువరించింది. చివరకు సీఐడీ వ్యవస్థకు దురుద్దేశ్యాలను ఆపాదించింది. మార్గదర్శి బ్యాంకు మేనేజర్ల విచారణపై ఎటువంటి స్పందన లేదు. అయితే అటు బ్రాంచ్ మేనేజర్ల చెప్పిన దాంతో రామోజీకి ఉచ్చు బిగిసిందని చెప్పుకోవడం కాస్తా అతే అవుతోంది. ఈ విషయంలో రాజగురువుకు ఉన్న లెక్కలు ఉన్నాయని.. ఆయన ఎన్నెన్నో మార్గాలను అన్వేషిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper