spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Rushikonda Palace: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ను మించి.. రిషికొండ ప్యాలెస్.. ఆశ్చర్యపోయిన...

Rushikonda Palace: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ను మించి.. రిషికొండ ప్యాలెస్.. ఆశ్చర్యపోయిన చంద్రబాబు

Rushikonda Palace: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు రిషికొండ ప్యాలెస్ ను సందర్శించారు. ఎప్పటినుంచో ఆయన అనుకుంటున్నప్పటికీ.. ఇప్పటికి కుదిరింది. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రిషికొండ ప్యాలస్ పై అనేక విమర్శలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని ప్రభుత్వ కార్యక్రమాల కోసం వాడతామని ప్రకటించింది. ఆమధ్య టిడిపి నేతలు రిషికొండ ప్యాలెస్ ను సందర్శించారు. దానిని హాస్పిటల్ గా ఉపయోగిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కాని.. ఆ ప్రతిపాదన ఆగిపోయింది.. అనంతరం మళ్లీ ఇన్నాళ్లకు చంద్రబాబు రిషికొండ ప్యాలెస్ ను సందర్శించారు. ఒక్కో నిర్మాణాన్ని నిశితంగా పరిశీలించారు. సంబంధిత అధికారులు, ఇతర పార్టీ నాయకులతో సరదాగా సంభాషించారు ఆ నిర్మాణాన్ని ఎలా చేశారు? ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు? దేనికోసం ఇంతటి స్థాయిలో హంగామా చేశారు? అనే విషయాలను చంద్రబాబు తెలుసుకున్నారు.

వైట్ హౌస్ ను మించిపోయిన సౌకర్యాలు..

రిషికొండ ప్యాలస్ లో సౌకర్యాలు వైట్ హౌస్ ను మించిపోయాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు..”వైట్ హౌస్ అత్యంత అధునాతనంగా ఉంటుంది. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉంటున్న అమెరికాలో శ్వేత సౌధం అనేది ఆ దేశ అధ్యక్షుడికి అధికారిక నివాసం. అందులో అనితర సాధ్యమైన సౌకర్యాలు ఉంటాయి. జగన్ కట్టించిన ఈ ప్యాలస్ లోనూ అదే స్థాయిలో సౌకర్యాలు ఉన్నాయి. వైట్ హౌస్ అంటే అమెరికా అధ్యక్షుడు ఉంటాడు కాబట్టి ఆ స్థాయిలో సౌకర్యాలను కల్పించారు. మరి ఈ ప్యాలస్ ను ఆ స్థాయిలో కట్టాల్సిన అవసరం ఏంటి? ఓవైపు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా.. వాటిని పక్కనపెట్టి దీనిని నిర్మించాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ ప్రజలు చూశారు.. ఈ దండగమారి ప్రభుత్వం ఎందుకనుకున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డిని సాగనంపారు.. 11 స్థానాలు ఇచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రజా కంటక పరిపాలన చేశాడో గుర్తుంచుకోవాలని” చంద్రబాబు వ్యాఖ్యానించారు.. ఇటీవల కాలం నుంచి చంద్రబాబు జగన్ మీద విమర్శలను పెంచారు. ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని.. ప్రభుత్వ ధనాన్ని సర్వనాశనం చేశారని ఆరోపిస్తున్నారు.. మొత్తంగా చూస్తే విశాఖపట్నం పర్యటన ద్వారా మరోసారి జగన్మోహన్ రెడ్డిని ప్రజల ముందు నిలబెట్టారు చంద్రబాబు. ప్రజధానన్ని దుర్వినియోగం చేశారనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. మరి దీనిపై ఇంతవరకు వైసీపీ శ్రేణులు స్పందించలేదు. ఒకవేళ దీనిపై అతిగా స్పందిస్తే కేసులు నమోదు అవుతాయనే భయంతోనే వారు అలా చేయలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Super El Nino

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
AP Rain Alert

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Polavaram Project

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Oktelugu Epaper