Homeఆంధ్రప్రదేశ్‌Rishikonda Palace: రిషి కొండ ప్యాలెస్ ను అలా చేయాల్సిందే.. కనీసం ఆ ఖర్చులకైనా వస్తాయి..

Rishikonda Palace: రిషి కొండ ప్యాలెస్ ను అలా చేయాల్సిందే.. కనీసం ఆ ఖర్చులకైనా వస్తాయి..

Rishikonda Palace: జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో రిషికొండను తొలచి ఒక ప్యాలెస్ నిర్మించారు. అసలు ఆ ప్యాలస్ ఎందుకు కట్టారు.. దేనికోసం కట్టారు.. అనే దానిపై ఇంతవరకు క్లారిటీ లేదు. ఒకవేళ జగన్ రెండవసారి ముఖ్యమంత్రి అయితే.. అందులో నుంచి పరిపాలన చేద్దామనుకున్నారా.. లేక ఇంకా ఎవరికోసమైనా కానుకగా కట్టించారా.. అనే ప్రశ్నలపై ఇంతవరకు క్లారిటీ లేదు.

అప్పట్లో కొంతమంది వైసీపీ నాయకులు అత్యుత్సాహంతో రెండవసారి కూడా తామే అధికారంలోకి వస్తామని ప్రకటించుకున్నారు. అంతేకాదు రిషికొండ ప్యాలస్ నుంచి జగన్ పరిపాలన చేస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాత అది సాధ్యం కాలేదు. ఎందుకంటే ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. రిషికొండ ప్యాలస్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. నారా లోకేష్ వేరువేరుగా పరిశీలించారు. అయితే ఇప్పటివరకు కూడా అది అలానే ఉంది. అప్పట్లో టూరిజం కోసం దానిని వాడుకుంటామని ప్రకటించారు. కానీ ఏమైందో తెలియదు ఆ ప్రతిపాదన అలానే ఉండిపోయింది.

తాజాగా రిషికొండ ప్యాలస్ పై విశాఖపట్నం ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని గదులున్న ఈ ప్యాలెస్ ను ఏం చేసుకోవాలో అర్థం కావడం లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి.. కొందరైతే ఈ ప్యాలెస్ ఉపయోగపడదు కాబట్టి.. హైదరాబాదు నమూనా అమలు చేయాలని.. ఫలక్ నామ ప్యాలస్ మాదిరిగా సినిమా షూటింగ్లకు అద్దెక్కించుకుంటే.. ఎంతో కొంత మిగులుతుందని.. కనీసం నిర్వహణ ఖర్చులకైనా డబ్బులు వస్తాయని చెబుతున్నారు. మరి దీనిపై కూటమినేతలు ఏం ఆలోచిస్తారో చూడాలి. ఎందుకంటే ఆ ప్యాలెస్ కరెంట్ బిల్లు.. నిర్వహణ ఖర్చు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.. అలాంటప్పుడు టూరిజం సెంటర్ లాగా దాన్ని మార్చి.. అద్దెలకు ఇచ్చుకుంటే కొంతలో కొంత డబ్బులు వస్తాయని సోషల్ మీడియాలో చాలామంది కామెంట్ చేస్తున్నారు.

నాడు ఈ ప్యాలస్ నిర్మించడానికి జగన్ ప్రభుత్వం ఎన్నో అడ్డగోలు పనులు చేసింది. పచ్చని చెట్లతో నిండుగా కనిపించిన రిషికొండ.. బోడి గుండు లాగా మారింది.. విశాఖపట్నం నగరానికి అద్భుతమైన మణిహారంగా రిషికొండ ఉండేది. కాని దానిని పూర్తిగా తొలచి.. ఇలాంటి నిర్మాణం చేపట్టారు. ఆ నిర్మాణం కోసం నాడు వందల కోట్లు ఖర్చుపెట్టారు. అసలు ఎందుకిలా ఖర్చు పెట్టారో ఇప్పటికీ తెలియదు.. రాత్రికి రాత్రి ఆ కొండమీద చెట్లను తొలగించారు. పగలు రాత్రి తేడా లేకుండా పనులు సాగించారు. అయితే ఈ భవనాన్ని తమ ఘనతగా వైసిపి నాయకులు చెప్పుకున్నారు. కానీ ఎందుకు నిర్మించారో ప్రజలకు వివరించలేకపోయారు. అందువల్లే ప్రజలు కూడా 11 స్థానాలకు పరిమితం చేసి.. ప్రజా ధనాన్ని అడ్డగోలు ఖర్చులకు పెడితే ఎలా ఉంటుందో చూపించారు.. మరి ఈ భవనంపై కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది.. ఏ విధంగా ఉపయోగించుకుంటుంది.. అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

AP Local Body Elections

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. 40 రోజుల్లోనే!

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో.. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం...
AP BJP

AP BJP: ఏపీ బీజేపీకి ఏమైంది?!

AP BJP: ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఆ పార్టీ అనుకున్న స్థాయిలో ముందుకెళ్లడం లేదు. పొత్తులో భాగంగా సీట్లు, ఓట్లు పెరిగాయే తప్ప.. గత...
AP Government Door To Door Campaign

AP Government Door To Door Campaign: చేసింది చెప్పేందుకు…ఏపీలో 45 రోజుల కూటమి ప్రచారం!

AP Government Door To Door Campaign: ఏపీలో టీడీపీ కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. మరో మూడేళ్ల పాలన ఉంది. తొలి రెండేళ్లు కూటమి పాలనపై సంతృప్తి శాతం అధికంగా...
Ranganath Controversy

Ranganath Controversy: ఆ భూమే.. హైడ్రా రంగనాథ్ కు ఇబ్బందికరం.. ఇంతకీ ఆ వివాదం ఏంటంటే..

Ranganath Controversy: హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ హైదరాబాద్ నగరంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అక్రమార్కుల భరతం పడుతున్నారు. భూకబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నారు. ప్రభుత్వం ఆయనకు పూర్తి స్వేచ్ఛ...
HYDRA Ranganath

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ ను రేవంత్ వదులుకోరు.. ఎందుకంటే..

HYDRA Ranganath: హైకోర్టు వ్యాఖ్యల తర్వాత.. భారత రాష్ట్ర సమితి.. భారతీయ జనతా పార్టీ హ్యాపీగా ఉండవచ్చు. కొంతమంది కబ్జాదారులు కూడా సంతోషంగా ఉండవచ్చు. కానీ హైడ్రా రంగనాథ్ విషయంలో రేవంత్ రెడ్డి...
Oktelugu Epaper