Homeఆంధ్రప్రదేశ్‌Amanchi Krishna Mohan: ఆ జిల్లాలో వైసిపి గూటికి బలమైన నేత?!

Amanchi Krishna Mohan: ఆ జిల్లాలో వైసిపి గూటికి బలమైన నేత?!

Amanchi Krishna Mohan: పోయిన చోటే వెతుక్కోవాలని చూస్తున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ). రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో బలపడాలని భావిస్తున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని చూస్తున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే ఈ నెల 9న ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి కూటమి ప్రభుత్వంపై సమరం మొదలు పెట్టనున్నారు. దానిని చివరి వరకు కొనసాగించాలని చూస్తున్నారు. 2003లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫార్ములాను అనుసరించనున్నారు. రాజకీయంగా అవకాశాలు లేని బలమైన నేతలను తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఒక బలమైన నేతను పార్టీలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ విషయంలో వై వి సుబ్బారెడ్డి చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అక్కడ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ద్వారా జరిగిన డ్యామేజ్ ను భర్తీ చేసేందుకు ఆమంచి కృష్ణమోహన్ రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది.

ప్రోత్సహించిన రాజశేఖర్ రెడ్డి..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) ఆవిర్భావం నుంచి ప్రకాశం జిల్లా ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది. ఆ పార్టీకి బలమైన నేతగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉండేవారు. ఈయన వై వి సుబ్బారెడ్డి కి స్వయానా బావ. వైయస్ జగన్మోహన్ రెడ్డికి సుబ్బారెడ్డి బాబాయ్ అవుతారు. ఈ లెక్కన శ్రీనివాస్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు. అందుకే వైయస్ రాజశేఖర్ రెడ్డి బాలినేని కి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. 2004లో తొలిసారిగా టిక్కెట్ ఇవ్వగా ఆయన గెలిచారు. దీంతో తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2009లో గెలిచిన బాలినేని ని మరోసారి మంత్రి పదవి ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్ వెంట అడుగులు వేశారు బాలినేని. 2014లో బాలినేని ఓడిపోగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండిపోయింది. ఆ సమయంలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు బాలినేని. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని ని మంత్రిని చేశారు జగన్. కానీ విస్తరణలో తొలగించేసరికి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అది మొదలు అనేక రూపాల్లో జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు కు గురి చేస్తూ వచ్చారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జనసేనలో చేరిపోయారు బాలినేని.

బాలినేని నిష్క్రమణతో..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తూ వెళ్తూ బాలినేని జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అనేక రూపాల్లో ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇవి జగన్మోహన్ రెడ్డిని ఎంతో బాధించాయి. అలాగని ప్రకాశం జిల్లాలో బలమైన నేతలు లేరు. కరణం బలరాం ఉన్న ఆశించిన స్థాయిలో ప్రభావం చూపడం లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి( Bhaskar Reddy ) స్థానికేతరుడు. ఇటువంటి పరిస్థితుల్లో బలమైన నేత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవసరం. బాబాయ్ వై.వి సుబ్బారెడ్డి ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకుడు అవసరం. అందుకే ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ వైపు జగన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆయనతో రాయబారాలు పూర్తయ్యాయని… త్వరలో ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరుతారని ప్రకాశం జిల్లాలో ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ ద్వారా ఎంట్రీ..
కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆమంచి కృష్ణమోహన్. 2000లో వేటపాలెం కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో దివంగత రోశయ్య ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి చీరాల నుంచి గెలిచారు. 2014లో ఆయనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించలేదు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. రికార్డ్ సృష్టించారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ 2019 ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కానీ ఆ ఎన్నికల్లో అనూహ్యంగా టిడిపి అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో.. ఆమంచి కృష్ణమోహన్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఆ ఇద్దరు నేతల మధ్య జరిగిన ఆధిపత్యంలో కరణం బలరాం వైపు జగన్ నిలిచారు. దీంతో ఆమంచి కృష్ణమోహన్ మనస్థాపానికి గురై 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి వైసీపీని దెబ్బతీశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమంచి కృష్ణమోహన్ జనసేనలో చేరుతారని ప్రచారం సాగుతోంది. కానీ ఆయనను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు వైవి సుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. త్వరలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper