allu arjun in rana hiranya kashyapa movie
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. భారీ సెట్లు, పెద్ద తారాగణంతో పౌరాణిక, కమిర్షియల్ కూడా సినిమాలు తీస్తుంటారాయన. నంది అవార్డుల డైరక్టర్గా ఆయనకు పేరుంది. ఆయన తీసిన సినిమాలకు ఇప్పటిదాకా తొమ్మిది నంది అవార్డులు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు వంటి బడా స్టార్లతో పలు సార్లు పని చేశారాయన. కానీ, ఈ కొంతకాలంగా గుణ శేఖర్ పరాజయాల్లో ఉన్నారు. విజయం రుచి చాలా ఏళ్లవుతోంది. 2003లో ‘ఒక్కడు’తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన తర్వాత అర్జున్, సైనికుడు సినిమాలతో నిరాశ పరిచాడు. 2010లో అల్లు అర్జున్ హీరోగా తీసిన వరుడు ఓ పెద్ద డిజాస్టర్. రెండేళ్ల తర్వాత రవితేజతో నిప్పు తీసిన ఆయన మళ్లీ చేతులు కాల్చుకున్నాడు. ఆపై, అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రుద్రమ దేవి కోసం చాలా సంవత్సరాలు కష్టపడ్డారు. 2015లో వచ్చిన ఈ చిత్రం విమర్శల ప్రశంసలు అందుకుంది కానీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీనికి నిర్మాత కూడా తానే కావడంతో గుణశేఖర్ కష్టాలు రెట్టింపయ్యాయి. అయితే, ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన ‘హిరణ్య కశ్యప’ అనే సినిమాతో మళ్లీ ముందుకురాబోతున్నారు.
Also Read : మళ్లీ ఈనాడు గ్రూపుకు ఊపు.. రంగంలోకి రామోజీ