Shoaib Akhtar: షోయబ్ అక్తర్.. పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్.. క్రికెట్ అభిమానులకు పరిచయం ఉన్న వ్యక్తి. సూపర్ఫాస్ట్ బౌలర్గా గుర్తింపు పొందిన అక్కర్ తక్కువకాలమే క్రికెట్లో కొనసాగినా.. భారతీయులకు చాలా సుపరిచితుడు. తాజాగా షోయబ్ అక్తర్ పెద్ద సోదరుడు షాహిద్ అక్తర్ ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. ఈ విషయాన్ని షోయబ్ అక్తర్ సోషల్ మీడియాలో ఈ వార్తను పంచుకుంటూ ‘నా ప్రియమైన పెద్ద సోదరుడు షాహిద్ అక్తర్ అల్లాహ్ను చేరుకున్నాడు’ పేర్కొన్నాడు. అంత్యక్రియలు జూన్ 24, 2026 సందర్భంగా ఇస్లామాబాద్లోని హెచ్–8 గోర్యార్డ్లో నిర్వహించినట్లు పేర్కొన్నాడు. అస్ర్ ప్రార్థన తర్వాత నమాజ్–ఎ–జనాజా జరిగినట్లు తెలుస్తోంది.
లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాది హాజరు..
ఈ అంత్యక్రియల్లో లష్కర్ ఎ తోయిబా సంస్థ రాజకీయ ముఖ్య సలహాదారు, పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్)కు చెందిన అనేక మంది నాయకులు హాజరయ్యారు. వారిలో పీఎంఎంఎల్ ఇస్లామాబాద్ అధ్యక్షుడు ఇనామ్ ఉర్ రెహ్మాన్ కంబోహ్ ప్రముఖంగా ఉన్నారు. లష్కర్ ఎ తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ కూడా ఈ కార్యక్రమంలో కనిపించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు పీఎంఎంఎల్, లష్కర్ ఎ తోయిబా సంబంధిత చానెల్స్ ద్వారా అధికారికంగా విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఉగ్ర సంస్థ సభ్యులు బహిరంగంగా వరుసలో నిలబడి ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి.
పహల్గాం దాడి మాస్టర్మైండ్ కసూరీ..
సైఫుల్లా కసూరీ అలియాస్ సైఫుల్లా ఖాలిద్ కసూరీ లేదా సైఫుల్లా ఖాసూరీ లష్కర్ ఎ తోయిబా సంస్థలో డిప్యూటీ చీఫ్గా ఉన్నారు. భారత గూఢచర్య సంస్థలు అతన్ని 2025, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ముఖ్య ఆర్కిటెక్ట్గా గుర్తించాయి. ఆ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. కసూరీ గతంలో భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ, 26/11 తరహా దాడుల బెదిరింపులు చేసినట్లు నివేదికలు ఉన్నాయి. అతను బహిరంగ సభల్లో పాల్గొని, పాకిస్థాన్ సైన్యంతో సంబంధాలు ఉన్నట్లు వ్యాఖ్యానించాడు.
పాకిస్తాన్లో ఉగ్రవాదుల స్వేచ్ఛా సంచారం..
హఫీజ్ సయీద్ నేతృత్వంలోని లష్కర్ ఎ తోయిబాపై అంతర్జాతీయ నిషేధాలు ఉన్నప్పటికీ, దాని రాజకీయ ముఖ్యరూపం పీఎంఎంఎల్ 2024 ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ సంఘటన భారత వ్యతిరేక ఉగ్ర శక్తులకు పాకిస్తాన్ సురక్షిత ఆశ్రయంగా మారిందని, వారు ఎటువంటి ఆంక్షలు లేకుండా బహిరంగ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఇప్పటికే ఉన్న ఆరోపణలను మరింత బలపరుస్తోంది. మీడియా, సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్ర సంస్థలు ప్రభావవంతమైన వ్యక్తులు, కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు ఈ సంఘటన వెల్లడి చేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
2011లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరమించిన షోయబ్ అక్తర్ ప్రస్తుతం వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. అతని కుటుంబ సభ్యులతో ఈ సంబంధాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఈ సంఘటన భారత–పాకిస్థాన్ సంబంధాలు, ఉగ్రవాద నియంత్రణ విషయంలో మరింత చర్చలకు దారితీస్తోంది. సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Ex Cricketer Shoaib Akhtar’s Brother died of heart attack!
Shahid Akhtar’s funeral was attended by PMML Islamabad President Inam ur Rehman Kamboh and other LeT terrorists.
PMML serves as a proxy for LeT. Why Were LeT Leaders/Terrorists There? pic.twitter.com/ldJiocolCl
— Megh Updates ™ (@MeghUpdates) June 27, 2026
