Homeఅంతర్జాతీయంIsrael Pakistan Tensions: అమెరికా అండ చూసుకుని ఎగిరి పడితే.. పాకిస్తాన్ ను...

Israel Pakistan Tensions: అమెరికా అండ చూసుకుని ఎగిరి పడితే.. పాకిస్తాన్ ను నేలకేసి కొట్టిన ఇజ్రాయిల్..

Israel Pakistan Tensions: ఇరాన్ , అమెరికా మధ్య ఇంతకాలం వరకు యుద్ధం చోటుచేసుకుంది. ఇప్పుడు కాస్త పరిస్థితులు నెమ్మదిగా మారిపోయినప్పటికీ.. దాడులు అడపాదడపా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తగ్గించడానికి పాకిస్తాన్ మధ్యవర్తి పాత్ర పోషించింది. ఒకసారి ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు నిర్వహించింది. ఆ చర్చలు అర్థాంతరంగా ముగిసిపోయాయి.

రెండోసారి చర్చలు జరుగుతాయని వార్తలు వచ్చినప్పటికీ.. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని తగ్గించడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాన్ని ఇజ్రాయిల్ తీవ్రంగా తప్పు పట్టింది. ముఖ్యంగా పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు పై ఇజ్రాయిల్ తీవ్రంగా మండిపడింది.. పాకిస్తాన్ విశ్వసనీయమైన మధ్యవర్తి కాదని బాంబు పేల్చింది..

ఇరాన్ దేశానికి పాకిస్తాన్ అనుకూలంగా ఉందని.. పాకిస్తాన్ కు ఇలాంటి దేశానికి సంబంధించిన సున్నితమైన అంశాలు తెలుసని.. అందువల్లే గోడ మీది పిల్లి లాగా వ్యవహరిస్తుందని ఇజ్రాయిల్ ప్రతినిధి రూవన్ అజార్ పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణం నెలకొల్పే విషయంలో ఇరాన్, అమెరికా పాకిస్తాన్ దేశాన్ని సంప్రదిస్తే తమకు ఎటువంటి ఇబ్బంది లేదని.. అయితే యుద్ధం విషయంలో తమ అభిప్రాయాన్ని పాకిస్తాన్ మార్చలేదని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది..”ఉగ్రవాదం.. ప్రాంతీయ భద్రత.. ఇరాన్ ప్రభావం ఇవన్నీ కూడా ప్రాధాన్యపరమైన అంశాలు. వీటిని పాకిస్తాన్ భర్తీ చేస్తుందని మాకు నమ్మకం లేదని” ఇజ్రాయిల్ ప్రకటించింది.

ఇజ్రాయిల్ ఇలా అనుమానించడంలో అనేక కారణాలు ఉన్నాయి. ఇరాన్ దేశానికి సహకారం అందిస్తోందని ఇప్పటికే యూఏఈ పాకిస్తాన్ మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తుంది. తమ దేశంలో స్థిరపడిన పాకిస్తాన్ పౌరులను బయటికి పంపిస్తోంది. అంతేకాదు స్పష్టమైన ఆధారాలతో పాకిస్తాన్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఇది ఇజ్రాయిల్ కు అనుమానాలు బలపడే విధంగా చేసింది. పాకిస్తాన్ దేశంతో ఇజ్రాయిల్ కు గొప్పగా చెప్పుకునే దౌత్య సంబంధాలు లేవు. అధికారికంగా ఇంతవరకు దౌత్య సంబంధాలు కొనసాగించిన దాఖలాలు లేవు. గతంలో ఇజ్రాయిల్ పాలస్తీనా మీద దాడులు చేసినప్పుడు పాకిస్తాన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఇజ్రాయిల్ పాకిస్తాన్ పాత్ర మీద విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం కొత్త మలుపుతీసుకుంది..

మరోవైపు రూవెన్ అజర్ భారత్ పాత్ర పై ప్రశంసలు కురిపించారు. పశ్చిమ ఆసియా ప్రాంతంలో స్థిరత్వం తీసుకురావడం భారత్ వల్ల మాత్రమే అవుతుందని పేర్కొన్నారు. అంతేకాదు భారతదేశంతో తాము వ్యూహాత్మకమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని.. అది ఇప్పుడు మరింత బలపడుతోందని ఆయన పేర్కొన్నారు. కాగా, పాకిస్తాన్, ఇజ్రాయిల్ మధ్య సంబంధాలు మొదటి నుంచి కూడా ఇబ్బందికరంగానే ఉన్నాయి. 974లో పాకిస్తాన్.. 1948లో ఇజ్రాయిల్ ఏర్పడినప్పటికీ.. ఇజ్రాయిల్ దేశాన్ని పాకిస్తాన్ ఇంతవరకు అధికారికంగా గుర్తించలేదు. పైగా పాలసీనకు మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular