Telugu Box Office Records: ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చిరంజీవి, మెగాస్టార్ గా ఎదగడమే కాకుండా, తన కుటుంబ సభ్యులను కూడా ఇండస్ట్రీ కి పరిచయం చేసి , వాళ్ళని కూడా సూపర్ స్టార్స్ గా మలిచిన తీరుకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ , ఆ తర్వాత అల్లు అర్జున్ , రామ్ చరణ్ వంటి వారు సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి , ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని సూపర్ స్టార్స్ గా ఎదిగారు. ఒకప్పుడు ఈ హీరోల రికార్డ్స్ మాత్రమే టాప్ 5 లో ఉండేవి. కేవలం ఓపెనింగ్స్ లో మాత్రమే కాకుండా, క్లోజింగ్ లో టాప్ 5 లో వీళ్ళ రికార్డ్స్ మాత్రమే ఉండేవి , ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడింది.
మొదటి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 5 చిత్రాల లిస్ట్ తీస్తే , అందులో 4 సినిమాలు మెగా హీరోలవే ఉన్నాయి. మొదటి స్థానం లో రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన #RRR చిత్రం ఉన్నది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి దాదాపుగా 74 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాతి స్థానం లో మరో మెగా హీరో లేటెస్ట్ సెన్సేషన్ ‘పుష్ప 2’ కూడా ఉంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి 70 కోట్ల 81 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఆ తర్వాత మూడవ స్థానం లో కూడా మెగా హీరో సినిమానే ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 65 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇలా టాప్ 5 లో మొదటి మూడు స్థానాలు మెగా హీరోలు కబ్జా చేయడం గమనార్హం.
కేవలం ఒక్క నాల్గవ స్థానం మాత్రమే ఇతర హీరోకి దక్కింది. ఆ హీరో మరెవరో కాదు, జూనియర్ ఎన్టీఆర్, ఆయన నటించిన ‘దేవర’ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 62 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక 5 వ స్థానం లో మెగా హీరో రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ చిత్రం నిల్చింది. ఈ చిత్రానికి మొదటి రోజున దాదాపుగా తెలుగు రాష్ట్రాల నుండి 54 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇలా టాప్ 5 సినిమాల్లో 4 సినిమాలను మెగా హీరోలే కబ్జా చేసారని , ఇప్పటికీ రికార్డ్స్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నారని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .
