Homeఅంతర్జాతీయంIran Israel War Analysis: యుద్ధంలో ఇరాన్‌ గెలిచింది.. 92 శాతం ఇజ్రాయెలీల మాట ఇదే!

Iran Israel War Analysis: యుద్ధంలో ఇరాన్‌ గెలిచింది.. 92 శాతం ఇజ్రాయెలీల మాట ఇదే!

Iran Israel War Analysis: ఇరాన్‌–అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య జరిగిన యుద్ధం ముగిసింది. శాంతి ఒప్పందం తుది దశకు చేరుకుంటోంది. స్విట్జర్లాండ్‌ వేదికగా జరిగిన చర్చలు కొలిక్కి వస్తున్నాయి. ఈ తరుణంలో ఇరాన్‌–అమెరికా, ఇజ్రాయెల్‌ వైపుల నుంచి వచ్చిన వ్యాఖ్యలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇజ్రాయెల్‌లోని ప్రజల్లో ఎక్కువ మంది యుద్ధంలో ఇరాన్‌ గెలిచిందని భావిస్తుండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం ఇరాన్‌కు తీవ్ర నష్టం జరిగిందని, అమెరికా లేదా ఇజ్రాయెల్‌కు ఎలాంటి నష్టం లేదని వాదిస్తున్నారు. ఈ వ్యతిరేక అభిప్రాయాలు యుద్ధం ఫలితాలపై ఎంత భిన్నమైన అవగాహనలు ఉన్నాయో చెబుతున్నాయి.

ఇజ్రాయెల్‌లో సర్వే ఫలితాలు..
జెరూసలెంలోని హెబ్రూ యూనివర్సిటీ, అగమ్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్వహించిన సర్వే ప్రకారం, 92 శాతం మంది ఇజ్రాయెలీలు యుద్ధంలో ఇరాన్‌ ఎక్కువ లాభపడిందని అభిప్రాయపడ్డారు. యుద్ధం తర్వాత ఇజ్రాయెల్‌ భద్రతా వ్యవస్థ బలహీనపడిందని 82.9 శాతం మంది అభిప్రాయపడ్డారు. అలాగే, యుద్ధం ముగింపుకు సంబంధించిన డీల్‌ను 63 శాతం మంది వ్యతిరేకించారు. ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు మాటలపై 73 శాతం మంది నమ్మకం లేదని తెలిపారు. జూన్‌ 17 నుంచి 20 వరకు 3,644 మందిపై జరిగిన ఈ సర్వే ఇజ్రాయెల్‌ ప్రజల్లో యుద్ధం ఫలితంపై తీవ్ర అసంతృప్తి, నిరాశను స్పష్టంగా చూపిస్తోంది.

ఇరాన్‌కు తీవ్ర నష్టం..
మరోవైపు, డొనాల్డ్‌ ట్రంప్‌ యుద్ధంలో అమెరికా లేదా ఇజ్రాయెల్‌ నష్టపోలేదని గట్టిగా వాదించారు. ఇరాన్‌ సైన్యం, నేవీ, ఎయిర్‌ఫోర్స్, లాంచింగ్‌ ప్యాడ్లు, మిసైల్స్, డ్రోన్లు దాదాపు పూర్తిగా నాశనం అయ్యాయని, వారి టాప్‌–2 లీడర్లు హతమయ్యారని పేర్కొన్నారు. ఇరాన్‌లో ద్రవ్యోల్బణం 250 శాతానికి చేరిందని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, హార్ముజ్‌ జలసంధి తెరవడంతో భారీగా ఆయిల్‌ సరఫరా జరుగుతోందని, అమెరికా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయని ట్రంప్‌ పోస్ట్‌లో వివరించారు. యుద్ధం తర్వాత నాలుగు నెలల్లో ఏమి మారిందని ప్రశ్నిస్తూ, ఇరాన్‌కు భారీ నష్టం జరిగిందని ఆయన వాదన.

ఇజ్రాయెల్‌ ప్రజలు యుద్ధం ఫలితాన్ని ఓటమిగా చూస్తుండగా, ట్రంప్‌ మాత్రం విజయంగా చిత్రీకరిస్తున్నారు. ఇది రెండు వేర్వేరు కోణాలను సూచిస్తోంది. ఇజ్రాయెల్‌ ప్రజల్లో భద్రతా ఆందోళన, నెతన్యాహు నాయకత్వంపై అవిశ్వాసం బలంగా ఉంది. యుద్ధం తర్వాత భద్రత వీక్‌ అయిందని చెప్పడం ద్వారా, భవిష్యత్తులో మరిన్ని ముప్పులు ఎదురవుతాయని వారు భయపడుతున్నట్లు అర్థమవుతోంది. మరోవైపు, ట్రంప్‌ వాదనలు సైనిక, ఆర్థిక నష్టాలను హైలైట్‌ చేస్తూ, యుద్ధం ఉద్దేశం సాధించబడిందని చెబుతున్నాయి. అయితే, ఇజ్రాయెల్‌ ప్రజల అభిప్రాయాలు ఈ వాదనలను పూర్తిగా తిరస్కరిస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular