Homeఅంతర్జాతీయంJoe Biden: అధికారం కోసం తెలుగోడి స్కెచ్: అమెరికా అధ్యక్షుడి హత్యకు ప్లాన్.. సంచలన నిజాలు

Joe Biden: అధికారం కోసం తెలుగోడి స్కెచ్: అమెరికా అధ్యక్షుడి హత్యకు ప్లాన్.. సంచలన నిజాలు

Joe Biden: అమెరికా శ్వేత దేశం. అంతకుమించి అధికారాలు ఉన్న దేశం. దానిని ప్రపంచానికి పవర్ హౌస్ అని పిలుస్తారు.. ఈ పవర్ హౌస్ ద్వారా ప్రపంచాన్ని నియంత్రణలో పెట్టుకోవచ్చు. అయితే ఇది అమెరికన్లకు మాత్రమే సాధ్యమవుతుంది..కాదు కూడదు అంటూ ఎవరైనా తోక జాడించినా, పిచ్చి పిచ్చి వేషాలు వేసినా ఎఫ్ బీ ఐ రంగంలోకి దిగుతుంది. పెరిగిన తోక కత్తిరిస్తుంది. ఇప్పుడు ఇది తెలుగు యువకుడికి అనుభవంలోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందో మీరూ చదివేయండి.

జో బైడెన్ హత్యకు కుట్ర

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను హత్య చేసేందుకు తెలుగు సంతతి అమెరికా యువకుడు కుట్ర పన్నడం కలకలం సృష్టించింది. అదే ట్రక్ తో వైట్ హౌస్ బారియర్స్ ను అతడు ఢీకొట్టడం సంచలనానికి కారణమైంది.. అయితే ఆ నిందితుడిని అరెస్టు చేసిన అమెరికా పోలీసులు.. అతన్ని కందుల సాయి వర్షిత్ గా గుర్తించారు. వాషింగ్టన్ డిసి ఫెడరల్ జిల్లా కోర్టుకు అక్కడి పోలీసులు వివరాలు సమర్పించారు. వారు సమర్పించిన ఆధారాల ప్రకారం.. అమెరికాలోని మిస్సోరి చెస్ట్ ఫీల్డ్ ప్రాంతానికి చెందిన సాయి వర్షిత్ సోమవారం రాత్రి సెయింట్ లూయిస్ నుంచి వాషింగ్టన్ డ్యూ ల్లెస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాడు. ఆ తర్వాత యూ_ హాల్ ట్రక్కును అద్దెకు తీసుకున్నాడు. అక్కడి నుంచి నేరుగా వైట్ హౌస్ ఉత్తరభాగంలోని సైడ్ వాక్ కు వెళ్లాడు. రాత్రి పదిగంటల సమయంలో గేటు వద్ద పోలీసులు ఏర్పాటుచేసిన బారియర్లను రెండుసార్లు ఢీకొట్టాడు. సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలను చూసిన భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటన జరిగిన వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. దీనికి ఇతర దర్యాప్తు సంస్థలు కూడా తోడు కావడంతో వారు సాయి వర్షిత్ ను విచారించారు. అయితే అతడు చెప్పిన విషయాలను విని అవాక్కయ్యారు. అమెరికా అధ్యక్షుడు చేతి నుంచి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఈ పని చేశానని సాయి వర్షిత్ చెప్పడం పోలీసులను నివ్వెరపరిచింది. దీనికి సంబంధించి గత ఆరు నెలలుగా ప్రణాళికలు రూపొందించుకున్నానని, ఆ వివరాలను గ్రీన్ బుక్ లో రాసుకున్నాడని సీక్రెట్ సర్వీస్ వర్గాలు మీడియాకు తెలిపాయి. అధికారాన్ని ఎలా దక్కించుకుంటావు? అని పోలీసులు అడిగిన ప్రశ్నకు “జో బైడెన్ ను చెప్పాలి అనుకుంటున్నాను. అవసరమైతే ఇతర సిబ్బందిని కూడా గాయపరచాలని భావించాను” అని సాయి వర్షిత్ చెప్పినట్టు అక్కడి సీక్రెట్ సర్వీస్ అధికారులు వెల్లడించారు. పైగా అతని బ్యాక్ ప్యాక్ లో నాజీల జెండా లభించిందని, దాన్ని అతడు అన్ లైన్ లో కొనుగోలు చేశాడని తెలుస్తోంది.. ఆ జెండా గురించి అక్కడి పోలీసులు సాయి వర్షిత్ ను ప్రశ్నించగా.. “జర్మనీ నియంత హిట్లర్ ప్రపంచంలో శక్తివంతమైన నాయకుడు. నాజీలకు గొప్ప చరిత్ర ఉందని” సాయి వర్షిత్ వివరించాడు. అయితే అతని మానసిక పరిస్థితి సరిగా లేదని అంచనాకు వచ్చిన పోలీసులు అతనిపై ఎటువంటి క్రిమినల్ రికార్డు లేదని స్పష్టం చేశారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లు, కోడింగ్ పై పట్టు ఉన్న సాయి వర్షిత్.. డేటా అనలిస్టుగా కెరియర్ పెంచుకోవాలని చూస్తున్నట్టు అతడి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ చూస్తే అర్థమవుతోందని పోలీసులు చెప్తున్నారు. కాగా ఈ ఘటన అమెరికా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular