నిర్మలాదేవి రామ్బదన్ సింగ్గా గుర్తించిన 60 ఏళ్ల బామ్మ పై ముంబై నడివీధుల్లో ఆకస్మాత్తుగా చిరుత దాడి చేసింది. ఆమె ముఖం, ఛాతీ మరియు వీపుపై చిరుత చేసిన దాడి గుర్తులు ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే……

ముంబైలోని ఆరే కాలనీ ప్రాంతంలో బుధవారం సాయంత్రం చిరుతపులి అకస్మాత్తుగా, ఎవరూ ఊహించని విధంగా దాడి చేయడంతో ఒక వృద్ధ బామ్మ ప్రాణాలతో బయటపడింది. ఆ బామ్మకి స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనం సరిహద్దులో ఉన్న ప్రాంతంలో చిరుతపులి దాడి చేయడం ఇది మూడవ సంఘటన అని ఒక వార్తా సంస్థ పేర్కొంది.
ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డయింది. వీడియోలో చూసినట్లుగా, 60 ఏళ్ల వృద్ధురాలు ఎత్తైన సిమెంటు దిమ్మె పై కూర్చుని, తన ఇంటి వెలుపల ఉన్నప్పుడు చిరుత వెనుక నుండి అకస్మాత్తుగా దాడి చేసింది. అయితే, ఆ మహిళ తన చేతికర్రతో చిరుతను గట్టిగా కొట్టి దూరంగా నెట్టగలిగింది. తరువాత, సహాయం కోసం బామ్మ కేకలు వేయగా… అది విని కుటుంబ సభ్యులు ఆమెను రక్షించారు. బామ్మ చూపిన తెగువ కి అందరూ శబాష్ అంటుండగా సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది
#WATCH | Mumbai: A woman barely survived an attack by a leopard in Goregaon area yesterday. The woman has been hospitalised with minor injuries.
(Visuals from CCTV footage of the incident) pic.twitter.com/c1Yx1xQNV8
— ANI (@ANI) September 30, 2021