spot_img
Homeట్రెండింగ్ న్యూస్Parvathipuram: ఈ కలెక్టర్ ఆదర్శం.. ప్రభుత్వాసుపత్రిలో భార్యకు ప్రసవం..

Parvathipuram: ఈ కలెక్టర్ ఆదర్శం.. ప్రభుత్వాసుపత్రిలో భార్యకు ప్రసవం..

Parvathipuram: ప్రభుత్వ ఆస్పత్రి.. అనగానే అమ్మో సర్కార్‌ దవాఖానానా అంటారు చాలా మంది. నేనురాను బిడ్డో సర్కార్‌ దవాఖానకు అని ఓ సినీ గేయ రచయిత నాటి పరిస్థితుల ఆధారంగా పాట కూడా రాశాలు. కానీ మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న సౌకర్యాలతో సర్కార్‌ దవాఖానాల్లోనూ మెరుగైన సేవలు అందుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులుతోపాటు, ప్రసవాల కోసం వచ్చే గర్భిణుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు ప్రైవేటు వైద్యం ఖరీదు కావడం కూడా చాలా మంది ప్రభుత్వ ఆస్పత్రికి రావడానికి కారణమవుతోంది. అయితే ఆర్థికంగా ఉన్నా.. అదికారం చేతిలో ఉన్నా.. కూడా ఓ కలెక్టర్‌ తన భార్యకు ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవం చేయించి ఆదర్శంగా నిలిచారు.

పార్వతీపురం కలెక్టర్‌..
ఆయన ఒక జిల్లాకు కలెక్టర్‌. జిల్లా పాలన యంత్రాంగానికి అయనే సుప్రీమ్‌. ఒక్క ఫోన్‌ చేస్తే కార్పొరేట్‌ ఆసుపత్రి వైద్యులు సైతం ఆయన ఇంటికి వచ్చి మరీ వైద్య సేవలు అందిస్తారు. అంతటి అవకాశం ఉన్నా వాటన్నింటినీ పక్కనపెట్టి ప్రభుత్వ దవాఖానాలోనే తన భార్యకు ప్రసవం చేయించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు, శస్త్ర చికిత్సలు, ప్రసవాలు అంటే ఇప్పటికీ ప్రజల్లో కొంత భయం, ఆందోళనలున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యత గల పరికరాలు, మెరుగైన వైద్యం అందదనే భావన కొందరిలో కనిపిస్తుంటుంది. ప్రభుత్వ ఆసుపత్రులను ఎంత అభివృద్ధి చేసినా రోగులు మాత్రం దాదాపు ప్రవేట్‌ ఆసుపత్రిలో వైద్యం తీసుకోవడానికే మొగ్గు చూపుతుంటారు. ఈ భావన పట్టణాల్లోనే ఉందంటే.. ఇక అమాయక గిరిజనుల విషయంలో చెప్పల్సిన పనిలేదు. దీంతో అడవిబిడ్డలు అధికంగా ఉన్న ఆ జిల్లాలో ఇలాంటి అపోహలను కొంతవరకైనా తొలగించాలని ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన భార్య ప్రసవాన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో కాకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో చేయించాలని నిర్ణయించుకున్నారు.

ప్రసవం మహిళకు మరో జన్మ..
సహజంగా ప్రతీ వ్యక్తి వివాహం, పిల్లల పుట్టుక విషయంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మహిళకు ప్రసవం మరో జన్మగా భావిస్తారు. దీంతో పేద, మధ్య తరగతి వారు సైతం అప్పో సొప్పో చేసి తమ స్తోమతకు మించి మరీ మెరుగైన వైద్యంతో కూడిన ప్రసవం కోసం కార్పొరేట్‌ ఆసుపత్రుల బాట పడుతుంటారు. కానీ, మన్యం జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ మాత్రం ఆర్థికంగా, అధికారికంగా స్థితిమంతుడిగా ఉన్నా కార్పొరేట్‌ ఆసుపత్రి వైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. అంతే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవానికి సిద్ధమై తన భార్యను పార్వతీపురం జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్‌ చేశారు. అలా జాయిన్‌ అయిన కలెక్టర్‌ భార్యకు గైనకాలజిస్ట్‌ వాగ్దేవి మెరుగైన వైద్యం అందించి పండంటి మగబిడ్డను చేతిలో పెట్టారు. ప్రసవం క్షేమంగా జరిగి తల్లీ బిడ్డ సురక్షితంగా ఉన్నారు. తన బిడ్డను చూసుకున్న కలెక్టర్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మొదటి ప్రసవం కూడా..
నిశాంత్‌కుమార్‌ తన భార్య మొదటి కాన్పు కూడా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేయించారు. అప్పుడు ఆయన రంపచోడవరం ఐటీడీఏ పీవోగా పనిచేస్తున్నారు. దీంతో ప్రసవం అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలోనే తన భార్యకు ప్రసవం చేయించారు. మొదటి కాన్పులో ఆడబిడ్డ కాగా, రెండవ కాన్పులో మగబిడ్డ పుట్టాడు. రెండు ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగడమే కాదు.. రెండు సార్లు తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయనే సందేశం ఇచ్చారు కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Oktelugu Epaper