Homeట్రెండింగ్ న్యూస్ఆ గ్రామంలో పాము కరిచినా చనిపోరట.. ఎక్కడంటే..?

ఆ గ్రామంలో పాము కరిచినా చనిపోరట.. ఎక్కడంటే..?

Nagenahalli Village

సాధారణంగా విషం ఉన్న పాము కాటు వేస్తే చనిపోతారనే సంగతి తెలిసిందే. అయితే ఒక గ్రామంలో మాత్రం పాము కాటు వేసినా చనిపోరు. విచిత్రం ఏమిటంటే ఆ గ్రామంలో ప్రజలు, పాములు కలిసి జీవిస్తారు. కర్ణాటక రాష్ట్రంలో దావణగిరి జిల్లాలోని నాగేన హళ్లి అనే గ్రామంలో పాములు కరిచినా మనుషులకు ఏం కాదు. ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా ఇలా జరగడానికి కారణం కనిపెట్టలేకపోవడం గమనార్హం.

Also Read: లాక్ డౌన్లో పెరిగిన ధనవంతుల ఆదాయం

తాచుపాముల గ్రామంగా పిలవబడే ఈ గ్రామంలో ఎవరైనా పాముకాటుకు గురైతే వారిపై విషం పని చేయదు. అయితే గ్రామంలో ఉన్నంత వరకు మాత్రమే విషం పని చేయదు. గ్రామం పొలిమేర దాటి వెళితే మాత్రం చనిపోతారు. సర్ప శాస్త్రవేత్తలు సైతం ఈ విధంగా ఎందుకు జరుగుతుందో తాము చెప్పలేకపోతున్నామని చెబుతున్నారు. గ్రామంలోకి కొత్తగా వచ్చిన వారికి పాము కాటు వేస్తే మాత్రం ఆ పామును స్మశానం దగ్గర ఉన్న యతీశ్వర మండపం దగ్గర ఉంచుతారు.

Also Read: అర్నబ్ టీఆర్పీ కోసం అంతపని చేశాడా..?

ఆ తరువాత పాము ఎవరిని కాటు వేసిందో ఆ వ్యక్తి హనుమాన్ ఆలయంలో తీర్థం తీసుకుని మరునాడు ఉదయం వరకు గుడిలో నిద్ర పోతే విషం నిర్వీర్యం అయిపోతుంది. గ్రామంలో ఈ విధంగా పాము కరిచినా ఎందుకు చనిపోరనే ప్రశ్నకు గ్రామస్తులు ఒక కథను చెబుతున్నారు. పూర్వం ఆ గ్రామంలో యతీశ్వర స్వామి అనే సాధువు ఉండేవారని ఆ సాధువుకు ఒకరోజు పొదల్లో బిడ్డ దొరికిందని ఆ పెంపుడు బిడ్డ 12 సంవత్సరాల వయస్సులో సర్పం వల్ల మృతి చెందాడని గ్రామస్తులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

పెంపుడు బిడ్డ మృతి చెందడంతో సాధువు నాగరాజును శపించడానికి ప్రయత్నించగా నాగరాజు సాధువును క్షమించమని వేడుకుని బిడ్డను బ్రతికించాడని.. సాధువు కోరిక మేరకు గ్రామంలోని నాలుగు సరిహద్దు బండరాళ్లు ఉన్నంత వరకు పాము కాటు వేసినా చనిపోరని గ్రామస్తులు చెబుతున్నారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular