spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Mulapeta Port: ఆ జిల్లా ప్రజల దెబ్బకు పేరు మార్చుకున్న జగన్

Mulapeta Port: ఆ జిల్లా ప్రజల దెబ్బకు పేరు మార్చుకున్న జగన్

Mulapeta Port
Mulapeta Port

Mulapeta Port: భావనపాడు పోర్టు పేరు మారింది. ఇక నుంచి మూలపేట పోర్టుగా పిలవాలని వైసీపీ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ పోర్టు నిర్మాణానికి 2012 నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయే కానీ కొలిక్కి వచ్చిన దాఖలాలులేవు. అయితే పోర్టు నిర్మాణం కాకున్నా.. భావనపాడు పరిసర ప్రాంతాల్లో నిర్మించనుండడంతో.. అది భావనపాడు పోర్టుగానే సుపరిచితమైంది. అయితే వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత పోర్టు నిర్మాణంలో సమూల మార్పులు తీసుకొచ్చింది. ప్రతిపాదిత స్థలాన్ని మార్చింది. దీంతో పోర్టు పేరు మార్పు కూడా అనివార్యంగా మారింది. బుధవారం పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో భావనపాడు పోర్టు పేరును మారుస్తూ.. మూలపేట పోర్టుగా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికుల వలవన్ ప్రత్యేక ఉత్తర్వులిచ్చారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో…
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని భావనపాడులో 2014లో రూ.3,669 కోట్ల అంచనా వ్యయంతో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మించడానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. భావనపాడు, దేవునళ్తాడ, పొల్లాడ, మర్రిపాడు, కొమరల్తాడ, సూర్యమణిపురం గ్రామాల పరిధిలో 7,133 ఎకరాల్లో ప్రతిపాదన చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాంకేతిక సమస్యలు ఇతరత్రా కారణాలతో పోర్టు నిర్మాణ ప్రాంతాన్ని మార్చింది. సంతబొమ్మాళి మండలంలోని మూలపేట పంచాయతీ మూలపేట, విష్ణుచక్రం గ్రామాల మధ్య పోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేవలం 1,010 ఎకరాల్లో పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అయితే నిర్వాసితులుగా మారుతున్న మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలు ప్రభుత్వం ముందు 75 డిమాండ్‌లు ఉంచారు. సర్వం త్యాగం చేస్తున్నందున పోర్టుకు మూలపేట పోర్టుగా నామకరణం చేయాలని కోరారు. దీంతో భావనపాడు పోర్టు పేరును మూలపేట పోర్టుగా మార్చుతూ ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇచ్చింది.

Mulapeta Port
Mulapeta Port

మార్పులు అనివార్యం..
కొత్త డీపీఆర్ ప్రకారం పోర్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల కాలనీలు, మౌలిక వసతుల కల్పనలోను మార్పులు అనివార్యంగా మారాయి. పోర్టు నిర్మాణంతో నిర్వాసితులుగా మారిన వారికి సంతబొమ్మాళి మండలం నౌపాడలో 80 కోట్ల రూపాయల అంచనాతో పునరావాస కాలనీని కూడా నిర్మిస్తోంది. మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు చెందిన 600 కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద నిర్మిస్తోన్న ఈ ఇళ్లను మంజూరు చేసింది. ఈ నిర్మాణాలన్నింటికీ సీఎం జగన్ ఈనెల 19న శంకుస్థాపన చేయనున్నారు. అయితే దశాబ్దాలుగా ఉన్న భావనపాడు పోర్టు పేరు మార్పుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రస్తాయిలో భావనపాడు పోర్టుగానే సుపరిచితం. ప్రజల భావోద్వేగాలతో కూడిన అంశమైన పోర్టు పేరును ప్రజాభిప్రాయం చేపట్టకుండా ఏకపక్షంగా ఎలా పేరు మార్చేస్తారని జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ అంశం మరింత జఠిలమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Andhra Pradesh Voter List

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper