spot_img
Homeట్రెండింగ్ న్యూస్Nambala Keshava Rao: చంద్రబాబుపై నక్సలైట్ల అలిపిరి దాడి.. బలిమెల ఘటన.. సూత్రధారి ఆయనే!

Nambala Keshava Rao: చంద్రబాబుపై నక్సలైట్ల అలిపిరి దాడి.. బలిమెల ఘటన.. సూత్రధారి ఆయనే!

Nambala Keshava Rao: భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందిన సంగతి తెలిసిందే. సాధారణ సభ్యుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన కేశవరావు సుదీర్ఘ కాలం వివిధ హోదాల్లో పని చేశారు. మావోయిస్టు అగ్ర నాయకుడిగా ఎదిగారు. సారధ్య బాధ్యతలు తీసుకున్నారు. అయితే దేశవ్యాప్తంగా కీలక ఆపరేషన్లు చేపట్టారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలటరీ కమిషన్ కార్యదర్శి హోదాలో.. చాలా ఆపరేషన్లు చేశారు. ఆయనపై రివార్డులు పెరుగుతూ వచ్చాయి. ఆయన మరణించే నాటికి ఉన్న రివార్డు అక్షరాల రెండు కోట్ల రెండు లక్షల రూపాయలు.

Also Read: భారత్‌–పాక్‌ దౌత్య ఉద్రిక్తతలు.. ఢిల్లీలో మరో పాక్‌ అధికారుల బహిష్కరణ

* ఆ దాడులు వెనుక..
మావోయిస్టులు దేశవ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్ల వెనుక ఉన్నది కేశవరావు. ప్రముఖులపై దాడులతో పాటు భద్రతా దళాలపై సైతం దాడులు చేయించడంలో ఆరితేరిపోయారు కేశవరావు.ఏపీ సీఎం చంద్రబాబు పై నక్సలైట్లు దాడి చేసిన సంగతి తెలిసిందే. 2003 అక్టోబర్ 1న తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తున్న చంద్రబాబుపై నక్సలైట్లు అలిపిరి వద్ద దాడి చేశారు. క్లైమోర్ మైన్స్ తో చంద్రబాబు కారును పేల్చే ప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తు చంద్రబాబు ఉన్న కారు బుల్లెట్ ప్రూఫ్ కావడంతో ఆయన బతికి బయట పడ్డారు. ఈ ఘటనకు సైతం సూత్రధారి కేశవరావు.
* 2008 జూన్ 28న బలిమెల రిజర్వాయర్ వద్ద మావోయిస్టుల దాడిలో 36 మంది గ్రేహౌండ్స్ కమాండోలు మృతి చెందిన సంగతి తెలిసిందే. కూంబింగ్ ఆపరేషన్స్ చేపట్టి బలిమెల రిజర్వాయర్ మీదుగా లాంచ్ లో తిరుగు ప్రయాణమై వస్తున్న గ్రేహౌండ్స్ కమాండోలపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడి వ్యూహరచన, అమలు బాధ్యతలు అన్ని కేశవ రావే చూశారు.
* మావోయిస్టుల చరిత్రలోనే అతిపెద్ద దాడి ఘటన 2010 ఏప్రిల్ లో దంతేవాడ జిల్లాలో జరిగింది. ఏకంగా 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఇది కూడా కేశవరావు మార్గదర్శకంలోనే జరిగింది.
* 2018 సెప్టెంబర్ లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోయిస్టులు చేతిలో హతమయ్యారు. ఈ ఘటన వెనుక ఉన్నది కూడా కేశవ రావే.
* చత్తీస్గడ్ లో మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వా జూడుం ఉద్యమం వచ్చిన సంగతి తెలిసిందే. దీని వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మను మావోయిస్టులు చంపేశారు. మందు పాతర పేల్చడంతో ఆయనతోపాటు 27 మంది చనిపోయారు. దీనికి కూడా కేశవ రావే వ్యూహకర్త అని చెబుతారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper