ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు పెటాకులు కావడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. ఒక యువతి ఒక వ్యక్తిని ప్రేమించింది. కానీ ఆ వ్యక్తితో పెళ్లి చేయడానికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిదండ్రులు చూపించిన వ్యక్తినే సదరు యువతి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ అదే పెళ్లికి యువతి ప్రేమించిన వ్యక్తి రావడంతో కథ అడ్డం తిరిగింది. పెళ్లైన కొన్ని గంటల్లోనే వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది.
Also Read : విజయనగరంలో దారుణం… కరోనా మృతదేహాలనూ వదలని నీచులు…?
పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన దివ్య అనే యువతి వంశీ అనే యువకుడిని ప్రేమించింది. అయితే కొన్ని కారణాల వల్ల యువతి మరో యువకుడితో వివాహానికి అంగికరించాల్సి వచ్చింది. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తితో దివ్యకు వివాహం జరిగింది. పెళ్లి విషయం తెలిసిన వంశీ ఊరేగింపు కారును అడ్డుకుని దివ్యకు ముద్దు పెట్టాడు.
ఊహించని ఈ ఘటనతో షాక్ అవ్వడం పెళ్లికొడుకు, పెళ్లికొడుకు కుటుంబ సభ్యుల వంతయింది. వరుడు ప్రవీణ్ వంశీపై పోలీసులకు ఫిర్యాదు చేయగా దివ్య తనకు ప్రియుడే కావాలని ప్రియుడితోనే కలిసి జీవనం సాగిస్తానని ఫిర్యాదు చేసింది. ఏం చేయలో పాలుపోని పోలీసులు వధూవరులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ కాలేదు. వరుడు అక్కడినుంచి సొంతూరుకు వెళ్లిపోగా వధువును స్వధార్ హోంకు పంపించిన పోలీసులు ప్రియుడు వంశీపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : క్లాసులు వింటూ 25 కోట్లు సంపాదించిన విద్యార్థిని..?
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Lover entered newly married couple barath kissed bride karimnagar
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com