Uttar Pradesh
Uttar Pradesh: ప్రస్తుత కాలంలో కట్టుకన్న భార్య నుంచి కూడా భర్తకు రక్షణ లేకుండా పోయింది. ఆడవారు మునుపటిలా లేరు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు మారిపోయారు. తాడో పేడో తేల్చుకుందాం అంటున్నారు. తేడా వస్తే ఆదిపరాశక్తిలా మారిపోతున్నారు. అయితే కొందరు మహిళలు భర్తలను రాచి రంపాన పెడుతున్నారు. కావాలని టార్చర్ చేస్తున్నారు. ఇలా భార్య టార్చర్ తట్టుకోలేక ఓ వ్యక్తి చివరకు తన ప్రైవేటు పార్టు కోసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది.
సజావుగా సాగిన కాపురంలో..
ఉత్తర ప్రదేశ్కు చెందిన దంపతులకు పెళ్లయి చాలాకాలం అయింది. కొన్నేళ్లు వీళ్ల కాపురం సజావుగా సాగింది. అయితే అనుకోకుండా దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. రోజు రోజుకు భార్య వేధింపులు పెరుగడంతో అసహనానికి గురయ్యాడు. ఈ క్రమంలో అతని తమ్ముడు కూడా వేధించడం మొదలు పెట్టాడు. వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేకపోయాడు. ఓ రోజు గదిలోకి వెళ్లి బ్లేడ్తో తన ప్రైవేటు పార్టు కోసుకున్నాడు.
అరుపులు ఇవి ఆస్పత్రికి…
ప్రైవేటు పార్టు కోసుకున్న తర్వాత బ్లీడింగ్ కావడంతో సదరు భర్త పెద్దగా కేకలు పెట్టాడు. దీంతో చట్టుపక్కలవారు వచ్చారు. కర్తపు మడుగులో పడి ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు నవ్వుకుంటుండగా, కొందరు భార్య తీరును తప్పుపడుతున్నారు. ఎంత టార్చర్ పెడితే ఇంత రారుణానికి ఒడిగట్టి ఉండాడని అంటున్నారు. మరికొందరు అతడి భార్య, తమ్ముడిని అనుమానిస్తున్నారు. ఇద్దరూ కలిసి టార్చర్ చేయడం ఉద్దేశపూర్వకంగానే అయి ఉంటుందని భావిస్తున్నారు.
వివాహేతర సబంధమేనా..
భార్యకు, భర్త తమ్ముడికి మధ్య ఏమైనా సంబంధం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కొన్నేళ్లు సజావుగా సాగిన కాపురంలో ఒక్కసారిగా గొడవలు పెరగడాన్ని అనుమానిస్తున్నారు. భర్త తమ్ముడి రాకపతోనే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు.