Ramya Raghupathi- Naresh: నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఇటీవల మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె నరేష్ వ్యక్తిగత జీవితం మీద సీరియస్ అలిగేషన్స్ చేశారు. తనను వదిలించుకోవడానికి నరేష్ దారుణాలకు పాల్పడ్డారని ఆమె ఆరోపణలు చేశారు. నేను విడాకులు కోరుకోవడం లేదు. నరేష్ నాకు కావాలంటున్న రమ్య రఘుపతి మరో లేటెస్ట్ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. ఆయనకున్న వందల కోట్ల ఆస్తిపై మీరు కన్నేశారట? ఆయన పేరున అప్పులు చేశారట? కదా అని అడగ్గా… ఆయన ఆస్తి నేను కోరుకోలేదు. భార్యగా ఉండాలి అనుకున్నాను అంతే. డబ్బులు కావాలంటే విడాకులు ఇస్తే కోట్లు ఇవ్వడానికి నరేష్ సిద్ధంగా ఉన్నాడని కొందరు అంటున్నారు.

మా మధ్య మనస్పర్థలు ఉన్నమాట నిజమే. చర్చల ద్వారా అవి పరిష్కారం చేయండి అని మాత్రమే నేను కోర్టులో పిటిషన్ వేశాను. విడాకులు కోరుకోలేదు. ఇక ఆయన పేరు చెప్పి నేను డబ్బులు వసూలు చేశానన్నది నిజం కాదు. నేను నరేష్ భార్యను కాబట్టి అదే చెప్తాను. నా వ్యాపారం దెబ్బతినడంతో నేను కొన్ని అప్పులు చేశాను. మా అమ్మగారి ఫ్లాట్ తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నాను. నేను చేసిన అప్పులకు ఆయన గ్యారెంటర్ గా ఏమైనా సంతకాలు చేశాడా? అదేం లేదు కదా. నరేష్ హామీ ఉండి నాకు లోన్స్ ఇప్పించలేదు.
నాపై వచ్చిన ఆర్థిక నేరారోపణల వెనుక కూడా నరేష్ హస్తం ఉంది. వెనకుండి అన్నీ చేయించాడు. నేను నరేష్ డబ్బులు కోరుకోవడం లేదు. కొడుకు మైంటెనెన్సు కి నెలకు రూ. 70 వేలు ఇస్తున్నాడు. గతంలో రూ. 50 వేలు ఇచ్చేవాడు. అది కూడా ఓ మూడేళ్ళ నుండి ఇస్తున్నాడు. ఇన్ని గొడవలు జరిగినా నరేష్ ని భర్తగా కోరుకోవడానికి ఒకే ఒక్క కారణం… నా కొడుకు కోసం. తాను తండ్రిని కోరుకుంటున్నాడని, రమ్య రఘుపతి చెప్పుకొచ్చారు.

ఇక పవిత్ర లోకేష్-నరేష్ విడాకులు మంజూరు కాకుండా పెళ్లి చేసుకుంటారని నేను అనుకోవడం లేదు. అది చట్ట విరుద్ధం అని వారికి తెలుసు. ఆ మాత్రం జ్ఞానం వాళ్లకు లేదని నేను అనుకోను, అని రమ్య రఘుపతి చెప్పుకొచ్చారు. కాగా 2010లో నరేష్ మూడో వివాహంగా రమ్య రఘుపతిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి పుట్టాడు. ఐదేళ్ల క్రితం వీరు మనస్పర్థలతో విడిపోయారు. చట్టబద్ధంగా విడాకులు తీసుకోలేదు. ప్రస్తుతం నరేష్ పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడు. ఇటీవల ఆమెతో పెళ్లి ప్రకటన చేశాడు.