Homeట్రెండింగ్ న్యూస్IT Employees: ఐటీ లో మరో సంచలనం.. ఉద్యోగులందరూ ఇది తెలుసుకోవాల్సిందే!

IT Employees: ఐటీ లో మరో సంచలనం.. ఉద్యోగులందరూ ఇది తెలుసుకోవాల్సిందే!

IT Employees: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఐటీ కంపెనీలు ఇన్నాళ్లూ ఉద్యోగాల్లో కోత విధిస్తూ వచ్చాయి. పెద్దపెద్ద కంపెనీలు సైతం ఉద్యోగులను తగ్గించుకున్నాయి. ఈ క్రమంలో మరో కొత్తమార్గాన్ని ఎంచుకున్నాయి టెక్‌ కంపెనీలు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్‌ వంటి దిగ్గజ కంపెనీలు కొత్త ఆలోచనతో ముందుకు వచ్చాయి.

IT Employees
IT Employees

ఆఫీసులు ఖాళీ..
ఖర్చుల మదింపు చర్యలను టెక్‌ దిగ్గజ కంపెనీలు సైతం ఫాలో అవ్వటం మెుదలు పెట్టాయి. ఇందులో భాగంగా.. సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ డౌ¯Œ టౌన్‌ సీటెల్‌లోని ఆరు అంతస్తుల భవనాన్ని, బెల్లేవ్‌లోని స్ప్రింగ్‌ డిస్ట్రిక్ట్‌లోని 11 అంతస్తుల బ్లాక్‌ 6లో తన కార్యాలయాలను సబ్‌లీజ్‌కు ఇవ్వాలని నిర్ణయించింది. మైక్రోసాఫ్ట్‌ సైతం వాషింగ్టన్, బెల్లేవ్‌ ఆఫీసులను ఖాళీ చేయాలని నిర్ణయించింది.

సాఫ్ట్‌ మార్కెట్‌..
సాఫ్ట్‌ మార్కెట్‌ అనేది ఆర్థిక చక్రంలో ఒక దశ. ఈ క్రమంలో కొనుగోలుదారులు తక్కువగా ఉండటంతో వారి వ్యాపారాన్ని పొందేందుకు.. ఎక్కువ మంది విక్రేతలు ఉంటారు. అందుకే ప్రఖ్యాత కంపెనీలు ఈ సమస్యను ఎదుర్కొనేందుకు తమ కార్యాలయ ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. మైక్రోసాఫ్ట్‌ 2024తో ముగియనున్న బెల్లేవ్‌లోని 26 అంతస్తుల సిటీ సెంటర్‌ ప్లాజా భవన లీజును తిరిగి పునరుద్ధరించందని తెలుస్తోంది.

IT Employees
IT Employees

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌..
ఆఫీసులను ఐటీ కంపెనీలు ఖాలు చేస్తున్న క్రమంలో టెక్‌ దిగ్గజాలు ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అందించాలని నిర్ణయించాయి. రిమోట్‌ విధానంలో ఉద్యోగులకు పనిచేసే వెసులుబాటును అందిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఉద్యోగాల కోత కొనసాగిస్తున్నాయి. ఆఫీస్‌లను సబ్‌ లీజ్‌కు ఇవ్వడం ద్వారా ఆదాయం వస్తుందని, నిర్వహణ ఖర్చు తగ్గుతుందని బడా కంపెనీలు భావిస్తున్నాయి. లీజింగ్‌ నిర్ణయాలు ఉద్యోగులకు ఎక్కడి నుంచైనా పనిచేసేందుకు వీలుకల్పించినందున తీసుకున్నట్లు మెటా ప్రతినిధి ట్రేసీ క్లేటన్‌ సీటెల్‌ వార్తా పత్రికలకు వెల్లడించారు. దీంతో కంపెనీలు తమను తాము కాపాడుకునేందుకు మారిన ఆర్థిక పరిస్థితుల్లో ఎంత కష్టపడుతున్నాయనేది అర్థం అవుతోంది. రియల్‌ ఎస్టేట్‌ సమాచారం ప్రకారం 25 శాతం కార్యాలయాలు ఖాళీగా ఉన్నట్లు వెల్లడైంది.

మొత్తంగా ఐటీ కంపెనీల నిర్ణయం ఉద్యోగులకు ఆనందాన్నిస్తుంది. ఉద్యోగాల కోత ఆగిపోవడంతోపాటు ఎక్కడి నుంచైనా పనిచేసుకునే వెసులుబాటు కలుగుతుంది. కరోనా తర్వాత ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోమ్‌ కోరుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితులు ఉద్యోగులకు మళ్లీ వర్క్‌ ఫ్రం హోమ్‌ అవకాశం కల్పిస్తున్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

AI Impact On Education

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Rahul Gandhi Injury

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...
Ishan Kishan

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...
Vijayendra Prasad

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper