Hyderabad
Hyderabad: సాధారణంగా ఒక యువకుడు మోసం చేస్తే అతడిపై పగ పెంచుకుంటారు. లేదా. అతడిని పోలీసులకు అప్పగించి కటకటాల్లోకి నెట్టించేస్తారు. కానీ ఇక్కడ ఓ యువకుడు ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేశాడు. మూడో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇంతలో అతడిని పోలీసులు పట్టుకొని జైళ్లో వేశారు. కానీ అసలు ట్విస్టు ఇక్కడే మొదలైంది. ఆ యువకుడు తనకే కావాలంటూ మోసపోయిన యువతులు గొడవ పెట్టుకున్నారు. జుట్లు పట్టుకున్నారు. వీరి పరిస్థితిని చూసి పోలీసులు ఏం చేశారో తెలుసా?
హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ వింత సంఘటన గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక పోలీసులు తెలపిన వివరాల ప్రకారం.. ఏపీలోని రాయచోటి ప్రాంతానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ అనే వ్యక్తి హైదరాబాద్ మాదాపూర్ లోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఆసుపత్రిలోని ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తరువాత ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలిశాడు.
కొన్నాళ్ల తరువాత ఫక్రుద్దీన్ కార్ఖానాలోని ఆసుపత్రికి మారాడు. ఆ తరువాత మరో యువతితో పరిచయం పెంచుకొని ఇదే రకంగా ప్రవర్తించాడు. అయితే అక్టోబర్ 6న ఎవరికీ చెప్పకుండా సొంత గ్రామం వెళ్లాడు. అక్కడ ఇంటి పక్కనే ఉన్న మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. సినిమా ట్రిక్ లాగా సరిగ్గా నిశ్చితార్థం సమయానికి మధురానగర్ పోలీసులు ఎంట్రీ ఇచ్చి యువకుడి విషయం చెప్పారు. దీంతో అతడికి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు.
ఇక్కడివరకు కామన్ గా జరిగేదే. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఏర్పడింది. ఫక్రుద్దీన్ చేతిలో మోసపోయిన యువతులు ఇద్దరు మధురానగర్ పోలీస్ స్టేషన్ ఎదుట గొడవ పడ్డారు. అరెస్టయిన ఆ యువకుడు తనకంటే తనకు కావాలని పట్టుబట్టారు. వీరి గొడవను చూసిన పోలీసులు అయోమయానికి గురయ్యారు. చివరికి చేసేదేమీ లేక ఫక్రుద్దీన్ ను రిమాండ్ కు తరలించారు. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: A person who cheated two young women was arrested in hyderabad
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com