Karnataka: జీవితం నీటి బుడగలాంటిది.. అది ఎంతసేపు ఉంటుందో ఎవరూ చెప్పలేం. ప్రాణం కూడా అంతే.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం.. మృత్యువు ఏరూపంలో వస్తుందో.. ఎలా కబళిస్తుందో అంచనా వేయలేం. చావు మన చేతుల్లో లేనిది. తాజాగా ముక్కు పచ్చలు ఆరని చిన్నారిని 8 నెలలకే మృత్యువు కబళించింది. మొబైల్ చార్జర్ పిన్ను రూపంలో మృత్యువు ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన కర్ణాటకలోని కార్వార్ తాలూకాలో చోటుచేసుకుంది.
స్విచ్ ఆఫ్ చేయకుండా…
కార్వార్ ప్రాంతంలో సంతోష్ హెస్కామ్(హుబ్లీ ఎలక్ట్రిసిటీ సప్లయ్ కంపెనీ)లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.. ఆయనకు భార్య సంజన, ఎనిమిది నెలల కూతురు సానిధ్య ఉంది. ఎప్పటిలాగే సంతోష్ మంగళవాంర కూడా విధులకు వెళ్లే ముందు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టారు. అనంతరం ఛార్జింగ్ తీసి విధులకు వెళ్లారు. కానీ స్విచ్చ్ ఆఫ్ చేయడం చేయడం మర్చిపోయాడు. అదే సమయంలో ఇంట్లో కూతురు ఆడుకుంటోంది. ఛార్జర్ వైర్ కిందికి వేలాడుతూ ఉండటంతో ఆ పసి పాప..దానిని నోట్లో పెట్టుకుంది..
షాక్తో గిలగిలా..
విద్యుత్ ప్రసారం కావడంతో చిన్నారి షాక్కు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆ బాలిక మరణించింది. హాస్పిటల్కు చేరుకున్న వెంటనే చిన్నారి మరణించిందని డాక్టర్లు ప్రకటించారు. చిన్నారి కరెంట్ షాక్ తో చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి వాటి గురించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని పోలీసులు హెచ్చరిస్తున్నారు..