spot_img
Homeటాప్ స్టోరీస్Kavitha Comments On Paper Leak: కేటీఆర్ మాట్లాడొద్దన్నాడు గాని.. కవిత అడిగేస్తూనే ఉంది.. పేపర్...

Kavitha Comments On Paper Leak: కేటీఆర్ మాట్లాడొద్దన్నాడు గాని.. కవిత అడిగేస్తూనే ఉంది.. పేపర్ లీక్ లు మాజీ ఐటీ మినిస్టర్ పుణ్యమేనట

Kavitha Comments On Paper Leak: కవితను పట్టించుకోవద్దు.. ఎవరెవరో పార్టీలు పెడుతూనే ఉంటారు.. పార్టీలు ఇలా వస్తాయి అలా వెళ్ళిపోతాయి.. అలాంటివారిని లెక్కపెట్టొద్దు.. మీరు సైలెంట్ గా ఉండండి.. అనవసరంగా రెస్పాండ్ కావొద్దు.. ఇటీవల తన పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ చేసిన సూచన. కేటీఆర్ ఆ సూచన ఎవరికోసం చేశారు.. ఎవరిని ఉద్దేశించి చేశారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కేటీఆర్ మాటకు కట్టుబడి గులాబీ పార్టీ నేతలు మాట్లాడటం లేదు. కానీ కవిత ఆగడం లేదు. టిఆర్ఎస్ పార్టీని ఓన్ చేసుకున్న తర్వాత ఆమె పొలిటికల్ గా అడుగులు వేగంగా వేస్తున్నారు. మొహమాటం లేకుండా తన తండ్రిని ఇటీవల కాలంలో మర మనిషి.. మారిన మనిషి అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, గులాబీ పార్టీలో ఉన్న కీలక నాయకులను ఉద్దేశించి పందికొక్కులు అని విమర్శించారు. ఇంతటితోనే కవిత ఆగడం లేదు.

శనివారం కవిత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈసారి మరింత లోతైన విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా కేటీఆర్ ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు జరిగిన పేపర్ల అవకతవకల గురించి కవిత మొహమాటం లేకుండా మాట్లాడేశారు.. కేటీఆర్ నిర్వాకం వల్ల రెండు తరాలు నష్టపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ముందుండి కొట్లాడారని.. అటువంటి వాళ్లకు న్యాయం చేయలేకపోయామని.. కనీసం ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయామని.. దేశ దేశాలు జరిగిన ఐటీ మినిస్టర్ పేపర్ లీక్ అయితే ఏం చేశారని ప్రశ్నించారు. కేటీఆర్ పేరును ప్రముఖంగా ప్రస్తావించడంతో కవిత తన ఉద్దేశాన్ని బయటపెట్టారు. కవిత మాట్లాడిన మాటలకు గులాబీ పార్టీ నేతలు రకరకాల వక్రీకరణలు చేసినప్పటికీ.. అంతిమంగా మాత్రం గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పులను కవిత బయట పెడుతూనే ఉన్నారు. ఒకరకంగా తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ తో కాకుండా.. భారత రాష్ట్ర సమితి తోనే విపరీతంగా నష్టం జరిగిందని కవిత పరోక్షంగా చెబుతున్నారు.

కవిత ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో గులాబీ పార్టీ కౌంటర్ ఇస్తుందా.. ఎప్పటి మాదిరిగానే సైలెంట్ అవుతుందా.. చూడాలి. కవిత పార్టీ పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి మీద కంటే కేసీఆర్ మీద.. గులాబీ పార్టీ నేతల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలు కూడా అర్ధ రహితంగా కాకుండా.. అసలు విషయాలను బయటపెడుతున్నాయి. కవిత ఇలానే మాట్లాడుకుంటూ పోతే 2028 నాటికి గులాబీ పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి దీనిని గులాబీ బాస్ ఏ విధంగా తిప్పి కొడతారో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Amazon Employee Quits Job

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oktelugu Epaper