
హైదరాబాద్ ని భారీ వర్షాలు వదలడం లేదు. నిన్న భారీ వర్షంతో హైదరాబాద్ వాసులు అందరూ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నేడు మరోసారి భారీ వర్ష హెచ్చరిక చేసింది వాతావరణ శాఖ. నగరంలో రాబోయే మూడు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు.
హైదరాబాద్ నగరంలో రానున్న 4-5 గంటట్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. గులాబ్ తుపాను ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఖమ్మం, వరంగల్, మనుమకొండ, మహమూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల జిల్లాలో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షడం పడింది.
జీడిమెట్ల, కొంపల్లి, కుత్చుల్లాపూర్, కూకట్ పల్లి, అంబర్ పేట్, కాచిగూడ, గోల్నాక, నల్లకుంట, ఉప్పల్, రామంతాపూర్, పీర్జాదిగూడ, మేడిపల్లి, బోడుప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెంట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షాల కారణంగా జేఎన్టీయూ హెచ్ పరిధిలో నేడు జరగాల్సిన బీటెక్, బీ ఫార్మసీ పరీక్షలు వాయిదా పడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో ఇద్దరు అధికారులతో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్ 140 23202813ను సంప్రదించవచ్చిన తెలిపారు.