HomeతెలంగాణKCR And Revanth Reddy: కేసీఆర్‌ అలా.. రేవంత్‌రెడ్డి ఇలా.. ఇద్దరి ఆలోచనలో ఎంత వ్యత్యాసం!

KCR And Revanth Reddy: కేసీఆర్‌ అలా.. రేవంత్‌రెడ్డి ఇలా.. ఇద్దరి ఆలోచనలో ఎంత వ్యత్యాసం!

KCR And Revanth Reddy: కేసీఆర్‌.. అలియాస్‌ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. తెలంగాణ ఉద్యమ సారధి. ప్రత్యేక రాష్ట్రానికి పదేళ్లు సీఎం. టీడీపీ నుంచే రాజకీయ ఓనమాలు నేర్చుకున్న కేసీఆర్‌.. తర్వాత పార్టీని వీడి.. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ స్థాపించాడు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించారు. సబ్బండ వర్గాలను ఏకం చేశాడు. సకల జనుల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు పదేళ్లు కేసీఆర్‌కు అధికారం […]

KCR And Revanth Reddy: కేసీఆర్‌.. అలియాస్‌ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. తెలంగాణ ఉద్యమ సారధి. ప్రత్యేక రాష్ట్రానికి పదేళ్లు సీఎం. టీడీపీ నుంచే రాజకీయ ఓనమాలు నేర్చుకున్న కేసీఆర్‌.. తర్వాత పార్టీని వీడి.. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ స్థాపించాడు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించారు. సబ్బండ వర్గాలను ఏకం చేశాడు. సకల జనుల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు పదేళ్లు కేసీఆర్‌కు అధికారం ఇచ్చారు. తనవంతు బాధ్యతగా ఆయన తెలంగాణను చాలా అభివృద్ధి చేశారు. అయితే కేసీఆర్‌ ఆలోచనా విధానం అంతా నేనే.. అన్నట్లుగా ఉంటుంది. పదేళ్ల తర్వాత తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. రేవంత్‌రెడ్డి.. ఈయన కూడా టీడీపీలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. ఐదేళ్ల క్రితం కాంగ్రెస్‌లో చేరారు. చచ్చిపోయిందనుకున్న పార్టీకి పునరుజ్జీవం తెచ్చి.. అధికారంలోకి తీసుకువచ్చారు. సీఎంగా రెండేళ్లుగా పాలన సాగిస్తున్నారు. అయితే కేసీఆర్‌ ఆలోచనకు భిన్నంగా రేవంత్‌ ఆలోచనలు ఉంటున్నాయి.

జీహెచ్‌ఎంసీ విస్తరణ..
హైదరాబాద్‌ నగర అభివృద్ధి, పాలనా పనితీరు మెరుగుదలకి 27 మున్సిపాలిటీల్ని జీహెచ్‌ఎంసీకి విలీనం చేయడం కీలకం. గతంలో చిన్న మున్సిపాలిటీలుగా పనిచేస్తున్న ప్రాంతాలు ఇప్పుడు పెద్ద పరిధిలో సమన్వయపూర్వక అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఇది నగరంలో నగర ప్రణాళిక, నిధి వినియోగ దిశగా సౌకర్యాలు త్వరితగతిన అందించేందుకు సహాయపడుతుంది.

నూతన విద్యుత్‌ స్టోరేజీ,,
బ్యాటరీ స్టోరేజీ (బీఈఎస్‌ఎస్‌) ప్లాంట్లతోపాటు, పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ సాంకేతికతలను కూడా ప్రోత్సహించి, పీకవర్స్, ఆఫ్‌ పీకవర్స్‌ సమయాల్లో విద్యుత్‌ సరఫరా నిలకడనిచ్చే చర్యలు తీసుకుంటున్నారు. ఇది పర్యావరణ హితం కలిగించే పునరుద్ధరించదగిన శక్తి వినియోగానికి దారితీస్తుంది.

కేసీఆర్‌ విధానాల్లో లోపాలు..
కేసీఆర్‌ ప్రభుత్వ కాలంలో తీసుకున్న కొన్ని విద్యుత్‌ రంగ నిర్ణయాలు నష్టదాయకమైనవి, సబ్‌క్రిటికల్‌ ప్లాంట్లు, అధికధర ప్రైవేట్‌ పవర్‌ కొనుగోలు, సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం మొదలైన లోపాల వలన నష్టాలు ఏర్పడ్డాయి. ఈ మార్గం వదిలించి నూతన విధానాలు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టడం తెలంగాణ పునరుద్ధరణ దిశ.

సమగ్ర అభివృద్ధి కోసం..
మూడు వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ ఒప్పందాలు, మెట్రో, ఫ్యూచర్‌ సిటీ, మూసీ పునరుజ్జీవం వంటి ప్రాజెక్టులు కలిసి నగర అభివృద్ది, విద్యుత్‌ వ్యవస్థల ఆధునికీకరణ తెలంగాణకు కొత్త మార్గనిర్దేశం చేశారు.

కేసీఆర్‌ ప్రభుత్వ విధాన నష్టాలు, రేవంత్‌ రెడ్డి కొత్త సాంకేతికతల ప్రయోజనాలు, జీహెచ్‌ఎంసీ విస్తరణ, విద్యుత్‌ రంగంలో పరిష్కారాలు స్పష్టంగా గుర్తించవచ్చును. తెలంగాణ విద్యుత్‌ విధానానికి ఇది ఒక ప్రధాన దశాబ్దం, అది వేగంగా, స్థిరంగా అభివృద్ధి చెందుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper