HomeతెలంగాణLok Sabha Election Results 2024: కాంగ్రెస్‌ బీజేపీ నువ్వా నేనా...

Lok Sabha Election Results 2024: కాంగ్రెస్‌ బీజేపీ నువ్వా నేనా…

Lok Sabha Election Results 2024: తెలంగాణలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డాయి. ఇక ఈవీఎం కౌంటింగ్‌లోనూ ఇదే ట్రెండ్‌ కనబడుతోంది. మొదటి రౌండ్‌లో బీజేపీ 9 లోక్‌సభ స్థానాల్లో ఆధిక్యం కనబర్చగా, అధికార కాంగ్రెస్‌ నాలుగు స్థానాలకు పరిమితమైంది. ఎంఐఎం హైదరాబాద్‌లో ఆధిక్యత కనబర్చింది.

– ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి నగేశ్‌ ఈవీఎంలలోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

– మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్‌ పోస్టల్‌ బ్యాలెట్లలో 6 వేలకుపైగా లీడ్‌ సాధించగా, ఈవీఎం తొలి రౌండ్‌లోనూ స్పష్టమైన ఆధిక్యం సాధించారు.

– సికింద్రాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతోపాటు ఈవీఎం తొలి రౌండ్‌లో ముందంజలో ఉన్నారు.

– కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ పోస్టల్‌ బ్యాటెల్‌ ఓట్లతోపాటు తొలిరౌండ్‌ ఈవీఎం ఓట్లలో ముందంజలో ఉన్నారు.

– మహబూబ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి రెండో రౌండ్‌లోనూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. వంశీచందర్‌రెడ్డి కన్నా ముందు ఉన్నారు.

– నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ కౌంటింగ్‌లో దూసుకుపోతున్నారు. అటు పోస్టల్, ఇటు ఈవీఎం కౌంటింగ్‌లో స్పష్టమైన ఆధిక్యత కనబర్చారు.

– వరంగల్‌లో ఈవీఎం కౌంటింగ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్‌ వెనుకపడ్డారు.

– మెదక్‌లో రెండో రౌండ్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంటట్రామిరెడ్డి లీడ్‌లోకి వచ్చారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు వెనుకబడ్డారు.

– చేవెళ్లలో బీజేఈపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి లీడ్‌లోకి వచ్చారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో వెనుక పడినా, తొలి ఈవీఎం రౌండ్‌లో ముందుకు వచ్చారు.

– పెద్దపల్లి అభ్యర్థి వంశీకృష్ణ స్వల్ప మెజారిటీతో ముందజలో ఉన్నారు. నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి 5 వేల పైచిలుకు లీడ్‌లో ఉన్నారు.

– ఖమ్మంలో ఆరో రౌండ్‌ ముగిసే సరికి కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి భారీ ఆధిక్యం కనబరుస్తున్నారు 1.26 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావు కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.

– భువనగిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడి ఆధిక్యంలో ఉన్నారు.

– మహబూబ్‌బాద్‌లో బలరామ్‌నాయక్, జహీరాబాద్‌ సురేష్‌ షట్కార్‌ మూడో రౌండ్‌ ముగిసే నాటికి 10 వేల ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.

– నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి వెనుకబడాడ్డరు.

– కాంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ లీడ్‌లోకి వచ్చింది. ఇక్కడ శ్రీగణేశ్‌ 800పైచిలకు లీడ్‌లో ఉన్నారు.

తెలంగాణ సీఎం జిల్లాలో కాంగ్రెస్‌ వెనుకంజ..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి మహబబూబ్‌నగర్‌ జిల్లాలోని మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం, నాగర్‌కర్నూల్‌లో వంశీచందర్‌రెడ్డి, మల్లు రవి వెనుకబడ్డారు. ఇక రేవంత్‌ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న మల్కాజ్‌గిరిలో కూడా కాంగ్రెస్‌ వెనుకబడింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular