spot_img
HomeతెలంగాణCM Revanth Reddy: ఇచ్చింది 12 గంటలే..కేసీఆర్ కరెంటు గుట్టు విప్పిన రేవంత్

CM Revanth Reddy: ఇచ్చింది 12 గంటలే..కేసీఆర్ కరెంటు గుట్టు విప్పిన రేవంత్

CM Revanth Reddy: తెలంగాణలో ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితి నాయకులు పవర్ పాలిటిక్స్ చేశారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ మళ్లీ అంధకారంలోకి నెడుతుందని ప్రచారం చేశారు. వారికి బలం ఇచ్చేలాగా తానా మహాసభల్లో రేవంత్ రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు అని వ్యాఖ్యానించారు. ఇంకేముంది భారత రాష్ట్ర సమితి నాయకులు చెలరేగిపోయారు. ఎన్నికల ప్రచారంలో ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పరిపాలిస్తున్న కర్ణాటక రాష్ట్రంలో కరెంటు కోతలు ఉన్నాయని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తెలంగాణలో 24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పారు. అయితే తానా సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో.. అధికార భారత రాష్ట్ర సమితి తన సొంత మీడియాలో, సొంత పార్టీ నాయకులతో కౌంటర్ ఇవ్వడం ప్రారంభించింది. అయితే ఇదే అదునుగా రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ పనితీరును తవ్వడం మొదలు పెట్టారు. అయితే అప్పట్లోనే వ్యవసాయానికి రాష్ట్రం ఇస్తోంది 12 గంటలు అని తేలింది. చాలా ప్రాంతాల్లో సబ్ స్టేషన్ లలో కీ_ బుక్ లను దాచింది. అంతేకాదు కరెంటు గురించి ఏ వివరం కూడా బయటకు చెప్పొద్దని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ వివరాల ఆధారంగానే రేవంత్ రెడ్డి తిరిగి కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కరెంటు గుట్టు విప్పుతానని ఆ రోజే శపధం చేశారు. అన్నట్టుగానే ఆ కరెంటు గుట్టు విప్పడం ప్రారంభించారు.

12 గంటలే ఇచ్చారట

తెలంగాణ విద్యుత్ శాఖ పనితీరుపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.. ఈ సందర్భంగా పలు విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.. తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు చెప్పిన దాని ప్రకారం రాష్ట్రంలో సాగుకు రోజుకు 12 గంటలు మాత్రమే కరెంటు ఇచ్చారు.. అంతేకాదు విద్యుత్ సంస్థల అప్పులు 81,516 కోట్లకు చేరుకున్నాయని వివరించారు. అంతేకాదు రాష్ట్ర విద్యుత్ సరఫరా స్థాపిత లోడ్ సామర్థ్యం 19,475 మెగా వాట్లు కాగా.. ఇప్పటిదాకా 15,497 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదు అయిందని అధికారులు ప్రకటించారు.. మార్చి 14న అత్యధికంగా 297.89 యూనిట్లను సరఫరా చేశామని వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వ నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలు మొత్తం పూర్తయితే 16, 701 మెగా పట్ల విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుందని వివరించారు.

అప్పుల భారం

ఇక విద్యుత్ సంస్థలను అప్పుల భారం వేధిస్తోంది. 2014 జూన్ నాటికి ట్రాన్స్ కో 2,411 కోట్ల అప్పుల్లో ఉంది.. 2023 అక్టోబర్ 31 నాటికి ఆ భారం 10,136 కోట్లకు చేరుకుంది. జెన్కో సంస్థకు 2014 జూన్ నాటికి 7,662 కోట్ల అప్పు ఉంటే.. 2023 అక్టోబర్ 31 నాటికి అది 31,923 కోట్లకు చేరుకుంది. దక్షిణ డిస్కంకు 2014 జూన్ నాటికి 8,213 కోట్ల అప్పు ఉంటే.. 2023 అక్టోబర్ 31 నాటికి అది 21,041 కోట్లకు చేరుకుంది. ఉత్తర డిస్కం పై 2014 జూన్ నాటికి 4137 కోట్ల భారం ఉంటే 2023 అక్టోబర్ 31 నాటికి అది 15,416 కోట్లకు చేరుకుంది. మొత్తంగా 2014 జూన్ నాటికి ఈ విద్యుత్ సంస్థల అన్నింటిపై 22,423 కోట్ల భారం ఉంటే 2023 అక్టోబర్ 31 నాటికి అది 81, 516 కోట్లకు చేరుకుంది. అయితే విద్యుత్ శాఖ పనితీరుపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడంతో ఇన్నాళ్లు భారత రాష్ట్ర సమితి చేసుకున్న ప్రచారం మొత్తం అబద్ధమని తేలిపోయింది. మొన్నటిదాకా జెన్కో సిఎండిగా పనిచేసిన దేవులపల్లి ప్రభాకర్ రావు తో సమీక్ష నిర్వహిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని ఆ శాఖ అధికారులు అంటున్నారు. అయితే ఈ శాఖలో పేరుకుపోయిన బకాయిలను వసూలు చేస్తే కాంగ్రెస్ ప్రకటించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు పెద్ద కష్టం కాదని విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...
Kallanai Dam

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper