tv actor sravani
టాలీవుడ్లో సంచలనం సృష్టించిన టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సాయికృష్ణ, దేవార్జెడ్డిని ఎస్సార్నగర్ పోలీసులు మూడు రోజుల పాటు కస్టడికి తీసుకున్నారు. శ్రావణి ఆత్మహత్య కేసులో వీరిని విచారించనున్నారు. శ్రావణిని ప్రేమిస్తున్నట్లు నటించి తీవ్ర వేధింపులకు గురిచేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు దేవారాజ్రెడ్డి, సాయికృష్ణారెడ్డితో పాటు నిర్మాత అశోక్రెడ్డిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే ప్రస్తుతం సాయికృష్ణ, దేవారాజ్రెడ్డిని కస్టడిలోకి తీసుకొని విచారించనున్నారు. ఆ తరువాత అశోక్రెడ్డిని విచారించే అవకాశం ఉంది.
Also Read: కల్వకుంట్ల కవిత రీఎంట్రీ.. ఏం జరుగనుంది?