గుట్కా తరలింపు ఘటనలో ప్రముఖ సినీ నటుడు సచిన్జోషిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనపై ఐపీసీ 273, 336 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజన్కుమార్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లోని గగన్పహాడ్లో గుట్కా పట్టుకున్నామని, ఇందులో కోటి 25 లక్షల విలువైన పాన్ మసాలాలు ఉన్నాయన్నారు. గోవా మసాలా పేరుతో ఉత్పత్తులు చేస్తున్న జెఎం జోషి, సచిన్ జోషితో పాటు ఇతర నిర్వాహాకులపై మానిక్చంద్ యజమాని సురేశ్ ఫిర్యాదు చేశారు. ట్రేడ్ మార్క్ నిబంధనలు ఉల్లంఘించి 7 హిల్స్ మానిక్ చంద్ బ్రాండ్తో గుట్కా తయారు చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గత మార్చిలో హైదరాబాద్లో పట్టుకున్న గుట్కాలో సచిన్ జోషి పేరు బయటకు వచ్చింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేశామన్నారు.